Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఈ సారైనా నమ్మొచ్చా ?? ఆ సినిమా కి హిందీలో సీక్వెల్ వస్తోందట
స్టార్ డైరెక్టర్ శంకర్, అర్జున్ కాంబినేషన్ లో విడుదలైన చిత్రం "మొదల్వన్". ఈ చిత్రాన్ని తెలుగులో "ఒకే ఒక్కడు" అనే పేరుతో విడుదల చేశారు. హిందీలో అనిల్ కపూర్ హీరోగా "నాయక్" పేరుతో సినిమా రీమేక్ అయ్యింది. తెలుగు, తమిళంలో 1999లో ఈ సినిమా విడుదల కాగా, హిందీలో 2001లో విడుదలైంది. మూడు భాషల్లో సూపర్ హిట్ చిత్రంగా అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి హిందీలో రీమేక్ రూపొందనుందట.
ఇదివరకు కూడా తెలుగులో కూడా ఓ మూడేళ్ళ క్రీతమే ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారనీ, పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి హీరో అనీ వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఏమైందో గానీ మళ్ళీ ఎటువంటీ న్యూసూ లేకుండానే పవన్ ఒకేఒక్కడు అటకమీదకి చేరిపోయింది.
ఇప్పుడు ఈ సినిమాకి హిందీ సీక్వెల్ చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి, దీపక్ ముకుత్ ఈ సీక్వెల్ ను రూపొందించాలనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.దేశంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలు ఈ చిత్రంలో చర్చించనున్నట్లు చెన్నై వర్గాల సమాచారం.
సినిమా పూర్తిగా దేశ రక్షణదళంలో పేరుకుపోయిన అవినీతి చుట్టూ తిరుగబోతున్నట్లుగా చెప్తున్నారు. ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సినిమాకి కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తుండటం విశేషం. సీక్వెల్లో హీరో, హీరోయిన్లను ఇంకా సెలెక్ట్ చేయలేదు. కథ రాయడం ప్రారంభించాను. కంప్లీట్ చేయడానికి కొంత టైం పడుతుందని చెబుతున్నారు.ఈ సీక్వెల్ కి దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరు? అనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.