Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఈ సారైనా నమ్మొచ్చా ?? ఆ సినిమా కి హిందీలో సీక్వెల్ వస్తోందట
స్టార్ డైరెక్టర్ శంకర్, అర్జున్ కాంబినేషన్ లో విడుదలైన చిత్రం "మొదల్వన్". ఈ చిత్రాన్ని తెలుగులో "ఒకే ఒక్కడు" అనే పేరుతో విడుదల చేశారు. హిందీలో అనిల్ కపూర్ హీరోగా "నాయక్" పేరుతో సినిమా రీమేక్ అయ్యింది. తెలుగు, తమిళంలో 1999లో ఈ సినిమా విడుదల కాగా, హిందీలో 2001లో విడుదలైంది. మూడు భాషల్లో సూపర్ హిట్ చిత్రంగా అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి హిందీలో రీమేక్ రూపొందనుందట.
ఇదివరకు కూడా తెలుగులో కూడా ఓ మూడేళ్ళ క్రీతమే ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారనీ, పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి హీరో అనీ వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఏమైందో గానీ మళ్ళీ ఎటువంటీ న్యూసూ లేకుండానే పవన్ ఒకేఒక్కడు అటకమీదకి చేరిపోయింది.
ఇప్పుడు ఈ సినిమాకి హిందీ సీక్వెల్ చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి, దీపక్ ముకుత్ ఈ సీక్వెల్ ను రూపొందించాలనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.దేశంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలు ఈ చిత్రంలో చర్చించనున్నట్లు చెన్నై వర్గాల సమాచారం.
సినిమా పూర్తిగా దేశ రక్షణదళంలో పేరుకుపోయిన అవినీతి చుట్టూ తిరుగబోతున్నట్లుగా చెప్తున్నారు. ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సినిమాకి కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తుండటం విశేషం. సీక్వెల్లో హీరో, హీరోయిన్లను ఇంకా సెలెక్ట్ చేయలేదు. కథ రాయడం ప్రారంభించాను. కంప్లీట్ చేయడానికి కొంత టైం పడుతుందని చెబుతున్నారు.ఈ సీక్వెల్ కి దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరు? అనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.