twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గౌతం మ్యాటర్ : గొడవపడ్డ మహేష్, నమ్రత

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కాపురం పైకి సజావుగానే జరుగుతున్నట్లు కనిపిస్తున్నా....మహేష్-నమ్రతకు సరిగా పొసగడం లేదనే వార్తలు వాళ్ల ఇంట్లో పని చేసే వారి ద్వారా అప్పుడప్పుడు బయటకు పొక్కుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఇద్దరూ విడాకులు తీసుకునే వరకు వెళ్లారని, అయితే ఇద్దరు ఎంతగానో ఇష్టపడే వాళ్ల బాబు గౌతం కోసం కలిసి ఉంటున్నారనే పుకార్లు కూడా అప్పట్లో షికార్లు చేశారు.

    తాజాగా....ఈ ఇద్దరి మధ్యలో మరోసారి విబేధాలు భగ్గు మన్నాయి. పని వాళ్లంతా బిత్తర పోయేలా ఇటీవల ఒకరిపై ఒకరు అరుచుకున్నారని తెలిసింది. వీళ్ల మధ్య గొడవకు కారణం కొడుకు గౌతం మ్యాటరే. గౌతంను ఊటిలోని రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించాలని నమ్రత పట్టుబడుతుండగా, వీల్లేదని మహేష్ వాదనకు దిగినట్లు తెలిసింది.

    గౌతంను చూడకుండా మహేష్ ఒక్క రోజు కూడా ఉండలేడు. ఔట్ డోర్ షూటింగ్ వెళ్లినప్పుడు కూడా రోజుకు రెండు మూడుసార్లు గౌతం క్షేమ సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకుంటాడు. అందుకే గౌతంను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడం మహేష్ కు ఇష్టం లేదు. నమ్రతకు కూడా అంతే. అయితే గౌతం ఇంటి దగ్గర ఉండటం వల్ల మహేష్ బాబు సినిమాల ప్రభావం గౌతంపై పడుతుందనే ఆందోళనలో ఉంది నమ్రత. పైగా మహేష్ గారాబంతో మరీ మొండిగా తయారవుతున్నాడట. ఇటీవల విడుదలై దూకుడు ట్రైలర్లోని..'భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది" లాంటి డైలాగులు కంఠస్థం చేసిన గౌతం, పని వాళ్లపై వాటిని ప్రయోగించి దూషిండం మొదలు పెట్టాడట. దీంతో ఆందోళనకు గురైన నమ్రత గౌతంను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలని డిసైండింది. దీనికి మహేష్ అడ్డు చెప్పడంతో గొడవ షురూ..అదీ మ్యాటర్.

    English summary
    Serious war Between Mahesh and Namrata in the matter of their son gowtham.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X