Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పాకిస్థాన్ ప్రధాని మా నాన్నకు పెద్ద ఫ్యాన్...అంటూ ట్వీట్
ముంబై: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మోడీతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులను కలిసారు. ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీని కూడా ఆయన కలిసారు.
నవాజ్ షరీఫ్ను కలిసిన విషయాన్ని షబానా అజ్మీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ ఏర్పాటు చేసిన విందులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ కలుసుకున్నారు. తన తండ్రి కైపీ అజ్మీకి ఆయన పెద్ద ఫ్యాన్...ఈ విషయం ఆయన స్వయం చెప్పారు. మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ లంటే కూడా ఇష్టమని చెప్పారని షబానా అజ్మీ ట్వీట్ చేసారు.
ఈ సమావేశంలో ఆమె నవాజ్ షరీప్తో సినిమా రంగానికి సంబంధించిన విషయాలు కూడా చర్చించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనడానికి నవాజ్ షరీఫ్ తన వంతు సాయం చేస్తానని తెలిపారు. ఇందులో భాగంగా భారత్-పాక్ సంయుక్తంగా సినిమాలు నిర్మించే అంశానికి తన ఫుల్ సపోర్టు ఇస్తానన్నారు అని షబానా అజ్మీ ట్వీట్ చేసారు.
సనిమా రంగానికి సంబంధించి కలిసి పని చేయడం అనేది ఇరు దేశాల మధ్య సినిమా రంగంలో పోటీని పెంచడానికి కాకుండా.....ఇదరు దేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనడానికి సహకరిస్తుందని తాను భావిస్తున్నట్లు షబానా అజ్మీ తెలిపారు. శాంతి సౌబ్రాతృత్వం నెలకొనాలని ఆమె ఆకాంక్షించారు.