Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకటేష్.. పులి మీద సవారీ
హైదరాబాద్: మా చిత్రంలో వెంకటేష్ పులి మీద సవారి చేస్తాడు అంటున్నారు మెహర్ రమేష్. పులి మీద సవారి అంటే నిజంగా పులిని ఎక్కి తిరుగుతాడని కాదు... అలాంటి పరిస్ధితుల్లో చిక్కుకుంటాడు అని వివరిస్తున్నాడు. వెంకటేష్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'షాడో'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోంది. అక్కడ కలిసిన మీడియా వారితో మాట్లాడుతూ దర్శకుడు మెహర్ రమేష్ ఇలా స్పందించారు.
మెహర్ రమేష్ మాటల్లోనే... మంచి, చెడు... ఈ రెండు మార్గాలూ ఎదురుగా ఉన్నప్పుడు మంచే ఎంచుకోవాలి. కానీ గమనం, గమ్యం.. రెండూ చేతిలో లేనప్పుడు, వెనుక ప్రమాదం తరుముతున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అతను రెండో దారి ఎంచుకొన్నాడు. ముళ్ల బాటలో పులి మీద సవారీ చేశాడు. ఆ పులి పేరు... మాఫియా. ఆ ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు మెహర్ రమేష్.
ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ స్వయంగా ధృవీకరించారు. ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ పాత్ర పోషిస్తున్నారు. తాప్సి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఆసుపత్రి నేపథ్యంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. స్టన్ శివ నేతృత్వం వహిస్తున్నారు.
నిర్మాత పరుచూరి శివరామ్ప్రసాద్ మాట్లాడుతూ ''మాస్, యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రమిది. వెంకటేష్ పాత్ర చిత్రణ, ఆహార్యం కొత్త తరహాలో ఉంటాయి. ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేలా ఉంటుంది. విదేశాల్లో చిత్రించిన సన్నివేశాలు, పోరాటాలు ఉత్కంఠను కలిగిస్తాయి. ఈ వేసవి ప్రారంభంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. శ్రీకాంత్, మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, సమర్పణ: పరుచూరి కిరీటి.