Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ షారుక్, ప్రియాంక చోప్రా...
తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా మళ్లీ కలువబోతున్నారు. కానీ ఈ సారి మాత్రం సినిమా కోసం కాదు... సమాజంలో ఓ మంచి పని కోసం వీరిద్దరు కలవడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించే వన్ వరల్డ్: టు గెదర్ ఎట్ హోం అనే లైవ్ కార్యక్రమం కోసం ఇద్దరు కలుసుకోబోతున్నారు.
కొవిడ్ 19పై పోరాటానికి సిద్ధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రతారలందరితో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చూపిస్తారు. ఇందులో జాన్ లెజెండ్, ఎల్టన్ జాన్, లేడి గాగ, డేవిడ్ బెక్హమ్, ఇడ్రీస్ ఎల్బా తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 18న ప్రసారం కాబోతున్నది.
ఇప్పటికే కరోనాపై పోరాటానికి సహాయం అందజేస్తున్న షారుక్, ప్రియాంక చోప్రాలు మరోసారి తమ వంతు బాధ్యతగా చేయూతనిస్తున్నారు. షారుక్ పీఎం కేర్స్ ఫండ్, కేకేఆర్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల పక్షాన నిలిచారు. ఆరోగ్యపరమైన సేవ అందించే సామాజిక సంస్థలకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్విప్మెంట్స్ను అందించారు. ఏక్సాథ్: ది ఎర్త్ ఫౌండేషన్, రోటి ఫౌండేషన్ అండ్ వర్కింగ్ పీపుల్స్ చార్టర్కు అండగా నిలిచారు.