Don't Miss!
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- News నీ భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది, ఫ్రెండ్స్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్తకు ఆఫర్ !
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ పిరికివాడని అంటున్న సునీల్ శెట్టి
భారతీయులు విశాల హృదయులు కారని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తీవ్రంగా మండిపడ్డాడు. ఆఫ్రిదీని ఆయన పిరికివాడిగా అభివర్ణించాడు. పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన మొహాలీ టెస్టు మ్యాచును సునీల్ శెట్టి వీక్షించాడు. భారత్పై విమర్శలు చేయడానికి ముందు తాము ఏం చేశామో షాహిద్ అతని సోదరుడిని అడగాలని సునీల్ శెట్టి అన్నాడు. షాహిద్ సోదరుడు మ్యాచు ముగిసే వరకు తమతో మాట్లాడుతూ తమతోనే ఉన్నాడని చెప్పాడు. మ్యాచును చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల తాము స్నేహవూర్వకంగా వ్యవహరించామని చెప్పాడు.
పాకిస్తానీలు తమ ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా తాము చూశామని అన్నాడు. ఆఫ్రిదీ తన నోరు భారతదేశంలోనే తెరవాల్సిందని అతను అన్నాడు. పాకిస్తాన్కు తిరిగి వెళ్లిన తర్వాత అంతటి వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేశాడని సునీల్ శెట్టి అడిగాడు. ఆఫ్రిదీ చౌకబారు వ్యవహారమని, ఓ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్గా ఆఫ్రదీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందని చెప్పాడు. తాము ఎంతగా గౌరవించామో ఆఫ్రిదీ షోయబ్ అక్తర్ను అడగాల్సిందని అతను అన్నాడు.