Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం: షారుక్ ఖాన్ మీద కేసు నమోదు!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మీద రాజస్థాన్ లో కేసు నమోదైంది. రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం అయిన ఇష్యూలో రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేసారు.
కోటా : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మీద రాజస్థాన్ లో కేసు నమోదైంది. రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం అయిన ఇష్యూలో రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. షారుక్ స్వయంగా ఆస్తుల ధ్వంసానికి పాల్పడక పోయినా.... ఆయన వల్లే ఇదంతా జరిగింది అనేది ప్రధాన ఆరోపణ.
షారుక్ ఖాన్ తన తాజా చిత్రం 'రాయీస్' ప్రమోషన్లో భాగంగా ఆ మధ్య రైల్ యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయన్ను చూసేందుకు చాలా మంది అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వర్తకుల ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు పలువురు గాయపడ్డారు.
జనవరి 23న క్రాంతి రాజ్ ధాని ఎక్స్ ప్రెస్ లో షారుక్ ఖాన్ కోటా రైల్వేస్టేషన్ కు వచ్చారని, బోగి వద్ద ఆగిన ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారని, అభిమానుల్లోకి షారుక్ ఏదో విసరడంతో దాన్ని తీసుకోవడానికి వారు ఎగబడ్డారని, దీంతో స్టేషన్లో విధ్వంసం ఏర్పడిందని, తనకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయని, విక్రమ్ సింగ్ అనే వ్యాపారి ఆరోపించారు.
విక్రమ్ సింగ్ ఫిర్యాదు మేరకు షారుక్ మీద కేసు పెట్టాలని రైల్వే కోర్టు సూచించడంతో జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేసారు. అతడిపై ఐపీసీ 427, 120(బి), 147, 149 సెక్షన్లతో పాటు, రైల్వే చట్టంలోని 145, 146, 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.