షారుఖ్ ఖాన్కు కోర్టు ఊరట

షారుఖ్ ఖాన్ ఇంటి నిర్మాణం నిబంధనలకు విరుద్దంగా జరిగిందని సింప్రీత్ సింగ్, అమిత్ మౌరంద్ అనే ఇద్దరు కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. మన్నత్ గా పిలుచుకునే ఈ భవనం నిర్మాణంలో పురావస్తు చట్టాలను, తీరప్రాంత జోన్ నిబంధనలు ఉల్లంఘించారని తమ పిటిషన్ లో ఆరోపించారు. ఇదే విషయం మీద హై కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ తిరస్కరించడమే కాకుండా, పబ్లిసిటీ కోసం ఈ పిటిషన్ వేసారంటూ పిటిషనర్లకు 20 వేలరూపాయలు జరిమానా కూడా విధించింది. కానీ షారుఖ్ మాత్రం తన ఇంటి నిర్మాణంలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని, మున్సిపల్ సంస్థ అనుమతులతోనే ఈ నిర్మాణం జరిగిందని వివరించారు.


Click it and Unblock the Notifications











