బాలీవుడ్ బాద్షాకి ఇప్పుడో కొత్త బెంగ పట్టుకుంది. అతను నలభై నాలుగో సంవత్సరంలో కి ఈ యేడు ప్రవేశిస్తున్నాడు. ఆ పుట్టినరోజు వేడుక జరగగానే అతనికి బి.పి,షుగరు వస్తాయంటున్నారు. అయితే అది డిక్లేర్ చేసింది డాక్టర్స్ కాదు. అంతకన్నా ఎక్కువగా బాలీవుడ్ చేత కీర్తించబడుతున్న న్యూమరాలజిస్ట్ సంజయ్ బి.జుమ్మానీ. ఆయన అమితాబ్ కి పుట్టిన రోజునే అనారోగ్యం పాలవుతాడనీ,కడపులోనొప్పి వస్తుందనీ జాతకం చెప్పాడు. అది విచిత్రంగా నిజమైంది. దాంతో అందరికీ ఆయన చెప్పే విషయాలపై భయంకరమైన నమ్మకం కుదిరేశింది. ఆయన అదే రీతిలో షారూఖ్ కి ఇలా జరుగుతుందని ప్రకటించేసాడు. ఇంకేముంది షారూఖ్ కి ఇది వినే భయంతో ఆ రోగాలు వచ్చినట్లయిందిట.అదీ సంగతి..
Story first published: Tuesday, April 21, 2026, 16:39 [IST]