Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మందు బాబులు: ఆ ముగ్గురు హీరోలకు కోర్టు నోటీసులు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి మరియు మనోజ్ భాజ్పాయ్లకు కోర్టు నుండి నోటీసులు జారీ అయ్యాయి. మధ్యప్రదేశ్లో లిక్కర్ (సారాయి) అమ్మకాలను ప్రోత్సహిస్తూ వీరి పోస్టర్లు వెలవడంతో కోర్టు నుండి ఈ నోటీసులు జారీ అయ్యాయి.
మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు వీరిపై రావడంతో మధ్యప్రదేశ్లోని గ్వాలియార్ హైకోర్టు బెంచ్ ఈ సినిమా స్టార్లకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది అవద్వేష్ భడోరియా వేసిన పిటీషన్ విచారించిన కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. పోలీసులు ఈ సినిమా యాక్టర్లపై కేసు నమోదు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ ముగ్గురు యాక్టర్లతో పాటు మూడు డిస్ట్రిల్లర్లకు, గ్వాలియర్ ఎస్పీకి, ఇందెర్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్స్పెక్టర్కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటులతో పాటు, డిస్ట్రిల్లర్లు ఈ కేసులో తమ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జనవరి 22, 2011 ఎక్సైజ్ చట్టాల ప్రకారం... ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో లిక్కర్ ప్రకటనలు, హోర్డింగులు, అందుకు సంబంధించిన ఇతర ప్రకటనలు, సోడా ప్రకటనలపై నిషేదం విధించారు. అయితే ఆ నిషేదాన్ని ఉల్లంగిస్తూ సదరు హీరోలు లిక్కర్ బ్రాండ్ యాడ్లలో దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది.