Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'శంఖం' ఆడియో విడుదల
శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై, శివ దర్శకత్వంలో, జె. భగవాన్, పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శంఖం" గోపిచంద్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించారు. శంఖం చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లోని తాజ్ బంజారా హొటల్ లో జరిగింది. ఈ కార్యర్రమంలో గోపిచంద్, ప్రభాస్, బి.గోపాల్, వివి వినాయక్, కె.ఎస్. రామారావు, సి.కళ్యాణ్, పోకూరి బాబూరావు, శివ, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఎల్.బి శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు. ఆహుతుల సమక్షంలో వివి వినాయక్ ఈ చిత్రం ఆదియో కేసెట్ ను విడుదల చేసి తో ప్రతిని సి.కళ్యాణ్ కు అందజేయగా, ఆడియో సి.డి.ని ప్రభాస్ ఆవిష్కరించి తొలి ప్రతిని బి.గోపాల్ కు అందజేశారు.
ఈ సందర్భంగా కె.ఎస్, రామారావు మాట్లాడుతూ ఈ చిత్రం క్లిప్పింగ్స్ బాగున్నాయని అన్నారు. ఇది మంచి చిత్రమవుతుందనే విశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు. ఈ చిత్రంలో 'ఛత్రపతి" పోషంచినటువంటి పాత్రనే చేశానని ఎల్.బి.శ్రీరం చెప్పారు. ఇది శివ దర్శకత్వంలో గోపిచండ్ నటిస్తున్న రెండవ చిత్రం. సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఈ చిత్రానికి మంది సంగీతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.