Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'శంఖం' ఆడియో విడుదల
శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై, శివ దర్శకత్వంలో, జె. భగవాన్, పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శంఖం" గోపిచంద్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించారు. శంఖం చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లోని తాజ్ బంజారా హొటల్ లో జరిగింది. ఈ కార్యర్రమంలో గోపిచంద్, ప్రభాస్, బి.గోపాల్, వివి వినాయక్, కె.ఎస్. రామారావు, సి.కళ్యాణ్, పోకూరి బాబూరావు, శివ, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఎల్.బి శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు. ఆహుతుల సమక్షంలో వివి వినాయక్ ఈ చిత్రం ఆదియో కేసెట్ ను విడుదల చేసి తో ప్రతిని సి.కళ్యాణ్ కు అందజేయగా, ఆడియో సి.డి.ని ప్రభాస్ ఆవిష్కరించి తొలి ప్రతిని బి.గోపాల్ కు అందజేశారు.
ఈ సందర్భంగా కె.ఎస్, రామారావు మాట్లాడుతూ ఈ చిత్రం క్లిప్పింగ్స్ బాగున్నాయని అన్నారు. ఇది మంచి చిత్రమవుతుందనే విశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు. ఈ చిత్రంలో 'ఛత్రపతి" పోషంచినటువంటి పాత్రనే చేశానని ఎల్.బి.శ్రీరం చెప్పారు. ఇది శివ దర్శకత్వంలో గోపిచండ్ నటిస్తున్న రెండవ చిత్రం. సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఈ చిత్రానికి మంది సంగీతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.