twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శంఖం' ఆడియో విడుదల

    By Staff
    |

    శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై, శివ దర్శకత్వంలో, జె. భగవాన్, పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శంఖం" గోపిచంద్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించారు. శంఖం చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లోని తాజ్ బంజారా హొటల్ లో జరిగింది. ఈ కార్యర్రమంలో గోపిచంద్, ప్రభాస్, బి.గోపాల్, వివి వినాయక్, కె.ఎస్. రామారావు, సి.కళ్యాణ్, పోకూరి బాబూరావు, శివ, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఎల్.బి శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు. ఆహుతుల సమక్షంలో వివి వినాయక్ ఈ చిత్రం ఆదియో కేసెట్ ను విడుదల చేసి తో ప్రతిని సి.కళ్యాణ్ కు అందజేయగా, ఆడియో సి.డి.ని ప్రభాస్ ఆవిష్కరించి తొలి ప్రతిని బి.గోపాల్ కు అందజేశారు.

    ఈ సందర్భంగా కె.ఎస్, రామారావు మాట్లాడుతూ ఈ చిత్రం క్లిప్పింగ్స్ బాగున్నాయని అన్నారు. ఇది మంచి చిత్రమవుతుందనే విశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు. ఈ చిత్రంలో 'ఛత్రపతి" పోషంచినటువంటి పాత్రనే చేశానని ఎల్.బి.శ్రీరం చెప్పారు. ఇది శివ దర్శకత్వంలో గోపిచండ్ నటిస్తున్న రెండవ చిత్రం. సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఈ చిత్రానికి మంది సంగీతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X