Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కంటికి గాయం: ఏం గుచ్చుకుందో తెలియదన్న శ్రద్ధా కపూర్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కంటికి గాయమైంది. రాక్ ఆన్-2 చిత్రం షూటింగ్ కోసం శ్రద్ధా మేఘాలయ వెళ్లింది. షూటింగ్ జరుగుతుండగా తన కన్ను నొప్పింగా ఉందని శ్రద్ధా చిత్ర యూనిట్కు తెలిపింది. ఈ క్రమంలో శ్రద్ధా స్థానికంగా ఉన్న కంటి డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకుంది.
అయితే కార్నియాపై గీతలు వచ్చినట్లు డాక్టర్ తెలిపాడు. మెరుగైన చికిత్స కోసం చిత్ర దర్శకుడు రితేశ్ సిద్వానీ శ్రద్ధాను ముంబైకి పంపించాడు. ఇక రాక్ ఆన్-2 షూటింగ్ మరో రెండు నెలల పాటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోనే జరుగుతుందని దర్శకుడు తెలిపాడు.
షిల్లాంగ్లో షూటింగ్ జరుగుతుండగా తన కంట్లో ఏదో గుచ్చుకుందని, అదేమిటో గుర్తించలేకపోయానని, నిమిషాలు గడుస్తుండగానే నొప్పి తీవ్రమైందని శ్రద్ధా కపూర్ చెప్పింది. లోకేషన్లో ఉన్నవాళ్లంతా తన వద్దకు వచ్చారని, ఓదార్చే ప్రయత్నం చేశారని చెప్పింది.
కొద్దిసేపటి తర్వాత తనను కారులో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని, పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ కనుగుడ్డు స్వల్పంగా చిట్లిందని చెప్పారని అన్నారు. మెరుగైన వైద్యం కోసం ముంబై రాక తప్పలేదని, విమానాశ్రయం నుంచి నేరుగా తమ ఫ్యామిలీ ఐ స్పెషలిస్టు వద్దకు వెళ్లానని శ్రద్ధా వివరించింది.
రెండు రోజుల చికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిందని, ఇంకో మూడు రోజులు విశ్రాంతి తీసుకుని షిల్లాంగ్ వెళ్తానని చెప్పింది.