Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దాడి ఘటనతో కలిదిలిన సెన్సార్ బోర్డ్.... ‘శరణం గచ్చామి’కి గ్రీన్ సిగ్నల్!
‘శరణం గచ్చామి’ సినిమాపై కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది.
హైదరాబాద్: 'శరణం గచ్చామి' సినిమాపై కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.
తొలుత ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. సినిమాలో వివాదాస్పదంగా రిజర్వేషన్ల అంశాన్ని ఫోకస్ చేసారని, ఇది శాంతిభద్రతల సమస్యకు కారణం అవుతుందని నిరాకరించారు.
అయితే సినిమా మీద సెన్సార్ బోర్డ్ నిషేదం విధించడాన్ని వ్యతిరేకిస్తూ.... హైదరాబాద్ లో కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయంలపై విద్యార్థి సంఘాల నేతలు వారం క్రితం దాడి చేసారు. ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ, ఎస్టీ తెలంగాణ విద్యార్థి సంఘం నేతృత్వంలో ఆందోళనకారులు ఈ దాడికి పాల్పడ్డారు.
దాడి ఘటనతో వేగంగా
ఈ దాడి ఘటనతో సెన్సార్ బోర్డ్ వేగంగా కదిలింది. సోమవారం పోలీసు బందోబస్తు మధ్య మరోసారి సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను వీక్షించారు. యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసారు. ప్రేమ్రాజ్ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు.
జయప్రకాశ్రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్
నవీన్ సంజయ్, తనిష్క్ తివారి జంటగా నటించిన ఇందులో పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు ఆర్. కృష్ణయ్య వంటివాళ్లూ కీలక పాత్రలు చేసారు.
నిర్మాత మురళి మాట్లాడుతూ
‘‘డాక్టరేట్ పొందిన నేను, ఎంతో పరిశోధనచేసి తయారుచేసిన సబ్జెక్టుతో ఈ సినిమా నిర్మించాను. గత డిసెంబర్లో సెన్సార్కు పంపితే, జనవరి 2న సెన్సార్ సభ్యులు చిత్రాన్ని చూశారు. ఈ సినిమా విడుదలైతే సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందనీ, అల్లర్లు చెలరేగుతాయనీ, అందువల్ల సర్టిఫికెట్ను నిరాకరిస్తున్నామనీ తెలియజేస్తూ సెన్సార్ ఆఫీసర్ పంపిన ఉత్తరం అందడంతో షాకయ్యామని, ఇపుడు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో ఆనందంగా ఉందని మురళి తెలిపారు.
కథేంటి?
‘‘ఇది ఓ జర్నలిస్ట్ కథ. రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల అంశంపై పీహెచ్డీ చేయాలనుకున్న అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర కథాంశం.