Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
శర్వానంద్ కొత్త సినిమా ‘రన్ రాజా రన్’
హైదరాబాద్: తెలుగు హీరో శర్వానంద్ ఆ మధ్య 'కో అంటే కోటి' సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కాస్త మంచి టాకే వచ్చినా...బక్సాఫీసు వద్ద కాసులు కురిపించలేక పోయింది. దీంతో భారీగా నష్టపోక తప్పలేదు శర్వానంద్. దీంతో మళ్లీ నిర్మాతగా మారే సాహసం చేయలేదు.
ఇటీవల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య-2' చిత్రంలో నటించిన శర్వానంద్......మరోసారి అపజయం చవిచూడటం అతని కెరీర్కు మరింత మైనస్గా మారింది. దీంతో యువ హీరోల రేసులో శర్వానంద్ చాలా వెనకబడి పోయాడు. ప్రస్తుతం ఆయన నిత్యా మీనన్ జంటగా 'ఏమిటో ఈ మాయ' చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
నెక్ట్స్ శర్వానంద్ సెల్ ఫోన్ల దొంగగా కనిపించబోతున్నారు. చిత్రం పేరు 'రన్ రాజా రన్'. పలు షార్ట్ ఫిల్మ్స్కు దర్శకత్వం వహించిన సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు. 'మిర్చి' సినిమాను నిర్మించిన యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్నారు. శర్వానంద్ సరసన కొత్త హీరోయిన్ నటించనుంది. ఘిబ్రాన్ సంగీత దర్శకుడు.
ప్రస్తుతం 'రన్ రాజా రన్' చిత్రం షూటింగ్ జరుగుతోంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ సినిమానే కాక శర్వానంద్ ఓనమాలు దర్శకుడు క్రాంతి మాధవ్ తో ఒక సినిమా చేయనున్నాడు.