ఫొటోలు: ర్యాంప్పై చెర్రీ హీరోయిన్ అందాల ఆరబోత
న్యూఢిల్లీ: రామ్ చరణ్ తేజ ఆరెంజ్ సినిమా హీరోయిన్ షాజన్ పదాంసీ ర్యాంప్పై అందాలను ఆరబోసింది. న్యూఢిల్లీలో జరిగిన విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో ఆమె ర్యాంప్పై నడిచింది. పరస్, షాలినీ డిజైనర్ జంటకు పదాంసీ గిరిజన రాణిగా మారిపోయింది. విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్లో ఆటమ్ - వింటర్ కలెక్షన్ను ప్రదర్శించింది.
చాలా సార్లు తనను క్యూట్గా, సాఫ్ట్ డ్రెస్లో చూస్తుంటారని, ఈసారి తన లుక్తో ప్రయోగం చేశానని, తనకు చాలా బాగుందని పదాంసీ చెప్పింది. ట్రైబల్ డిజైన్కు వారిద్దరు ఇచ్ిచన సమకాలీన మలుపు అద్భుతంగా ఉందని ఆమె పొగిడేసింది. నిరుడు హౌస్ఫుల్ 2 సినిమాలో షాజన్ పదాంసీ సినిమాల్లో చివరి సారిగా కనిపించింది.
తెలుగులో షాజన్ పదాంసీ రామ్ చరణ్ తేజ సరసన ఆరెంజ్ సినిమాలో అందాలను పరిచి, తెలుగు ప్రేక్షకులను అలరించింది.

డిజైనర్స్ గిరిజనుల నుంచి, అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల ఆదివాసీల నుంచి స్ఫూర్తి పొందారు. ఆదీవాసి సంస్కృతి రోమాన్స్కు ప్రాక్టికల్ సెలబ్రేషన్స్కు మధ్య పర్ఫెక్ట్ పారడాక్స్ను చూపించారు.

కమ్యూనికేషన్ ప్రభావం నుంచి స్పూర్తి పొందదినట్లు, ఆదికి అంటే ఆదివాసీల వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ డిజైన్స్ సమకాలీనమైనవని, ధారణకు యోగ్యమైనవని, ఆధునిక, సామాజిక ప్రాసంగిత విషయాల్లో ఇవి జానపద, ప్రపంచ బహుళ జాతి విషయాలను బయటపెడతాయని షాలిని అన్నారు.

గిరిజన, ఆదివాసీ డిజైన్లతో ర్యాంప్పై మోడల్స్ మెరిసిపోయారు.

సూదితో చేసిన వర్క్ బోర్డరస్, కేప్ వంటి టాప్స్, వ్రాపప్ గౌన్లు, ఇతర లక్షణాలతో చూడముచ్చటగా దుస్తులు కనిపించాయి.

ఉన్ని, తదితర ఫ్యాబ్రిక్ను దుస్తుల తయారీకి వాడారు.


Click it and Unblock the Notifications











