Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్, పవన్ కళ్యాణ్ లను కలిసినా...శేఖర్ కమ్ముల
మహేష్ బాబు, గోపీచంద్ లతోపాటు పవన్ కల్యాణ్ను కూడా కలిశాను. కానీ మేం సరిగా కమ్యూనికేట్ చేయలేదనుకుంటా..వర్కవుట్ కాలేదు అంటున్నారు ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల. 'ఆనంద్' తర్వాత పెద్ద సినిమాలు చేయడానికి ప్రయత్నం చేయలేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ పై విధంగా స్పందించారు. ఆదివారం రాత్రి ఓ పాపులర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో...ఆనంద్ తర్వాత రాసింది గోదావరి. దానికి చాలామంది హీరోలను అడిగాం.ఫలించలేదు. అంటే...ఒక డైరెక్టర్గా వాళ్లెవరూ గుర్తించలేదు అనుకోవాలి. అయినా నా దగ్గర పెద్ద హీరోలతో చేయడానికి కథలు లేవంతే. కథ దొరికితే హీరో కాళ్లు పట్టుకునైనా చేయించుకుంటా. నాకు ఈగో లేదు అన్నారాయన. రాణా ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన రూపొందించిన లీడర్ చిత్రం రీసెంట్ గా రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం గురించి చెబుతూ...2008 సమ్మర్ లో లీడర్ కథ సిద్ధం చేశాను. అప్పుడు ఎన్నికల హడావుడి. దీని మూలాలన్నీ మహాభారతం నుంచి తీసుకున్నాను. ఎన్నికలు పూర్తయ్యాక చిత్రీకరణ ప్రారంభించాం. సినిమా మొత్తం పూర్తిచేశాక వైఎస్ కు చూపిద్దామనుకున్నా..చిత్రీకరణ ప్రారంభం కాగానే..సినిమా కథలోలాగే..రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయారు. ఇది అతిపెద్ద కాకతాళీయం అన్నారు.