Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సెల్ ఫోన్ చూస్తే చిర్రెత్తి పోతున్న దర్శకుడు!
ఈ మధ్య సినిమా విడుదల కాకముందే...సదరు సినిమాకు సంబంధించిన సమాచారం, పాటలు, కొన్ని కీలకమైన సీన్లు బయటకు లీకవుతున్న సంగతి తెలిసిందే. ఇదంతా సినిమా యూనిట్ సభ్యుల పనే అనే విషయం గ్రహించిన దర్శక నిర్మాతలు షూటింగ్ స్పాట్లలో సెల్ ఫోన్లు నిషేదించడం లాంటి చర్యలకు పూనుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్ తన తాజా సినిమా 'జోకర్" సినిమా షూటింగులో సెల్ ఫోన్లను నిషేదించాడు. తన మాటను కాదని ఎవరైనా సెల్ ఫోన్ తీసుకుని సెట్ లోకి వస్తే వెర్రెక్కిన కోతిలా వారి మీద పడి రక్కేసినంత పని చేస్తున్నాడట.
ఈ దర్శకుడు ఇంతలా హడావుడి చేయడానికి కారణం ఇటీవల సినిమా సెట్లో షూటింగ్ జరుగుతుండగా యూనిట్ సభ్యుల్లో ఒకరు సెల్ ఫోన్ లో సీన్ చిత్రీకరించడం శిరీష్ కంట పడింది. దీంతో విడుదలకు ముందు సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు లీక్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. అందులో భాగంగానే సెల్ ఫోన్లపై నిషేదం. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ చేస్నున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ సెక్స్ బాంబ్ చిత్రాంగద సింగ్ పై ఐటం సాగ్ చిత్రీకరిస్తున్నారు.