Don't Miss!
- News లోక్సభ ఎన్నికల తర్వాత గందరగోళమే: ఉద్యమ కేసీఆర్ను చూస్తారంటూ బీఆర్ఎస్ అధినేత
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాగబాబు ఓటమి... ‘మా’జీ ప్రెసిడెంట్ శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్టేనా?
Recommended Video
జనసేన పార్టీ నుంచి నరసాపూర్ ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నాగబాబు ఓటమి ఎవరికి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలియదు కానీ... ఒక వ్యక్తి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పక తప్పదు. అతడే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా.
'మా' ఎన్నికల్లో తనను ఓటించడానికి నాగబాబు రాత్రికి రాత్రే చేసిన ప్రయత్నాలతో తీవ్ర మనస్తాపికి గురైన శివాజీ రాజా.... తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లే భీమవరం వెళ్లి నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. శివాజీ రాజా చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు.
నాగబాబుకు ఎన్ని ఓట్లతో ఓడిపోయారంటే?
ఈ ఎన్నికల్లో నాగబాబు దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మొత్తం పోలైన ఓట్లలో రాఘురామకృష్ణ రాజుకుకు 447594(38.11%), టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు 415685(35.39%), నాగబాబుకు 250289 (21.31%) ఓట్లు పోలయ్యాయి.
నాగబాబుకు ఓటేస్తే నష్టపోతామని నొక్కి చెప్పిన శివాజీ రాజా
మా తాత ముత్తాతల కాలం నుంచి మేమంతా భీమవరంలోనే పుట్టాం. నా ఊరిని నేను కాపాడుకోవాలి, నా నరసాపురం నియోజకవర్గాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాను, నాగబాబు లాంటి వ్యక్తులకు ఓటేస్తే నష్టపోతాం అంటూ శివాజీ రాజా ప్రచారం చేశారు. శివాజీ రాజా ప్రచారం నరసాపురం ప్రజలపై భాగా ప్రభావం చూపిందని స్పష్టమవుతోంది.
నరసాపురం ప్రజులు శివాజీ రాజా చెప్పిన ఆ విషయం నమ్మారా?
గతంలో నాగబాబు ‘మా' అధ్యక్షుడిగా పని చేసినపుడు 600 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్షుడిగా నిధులు తేవడం సంగతి అటుంచితే ఉన్న నిధులను ఖాళీ చేశాడు. 2 సంవత్సరాలు పదవిలో ఉండి... అసోసియేషన్ను రెండు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. అలాంటి వ్యక్తి మా నరసాపురం ఎంపీ అయితే లక్షల మందిని ఎలా బాగు చేస్తాడు? అని ప్రశ్న శివాజీ రాజా తెరపైకి తెచ్చారు. ఈ అంశం కూడా ఓటింగుపై ప్రభావం చూపినట్లుగా చర్చించుకుంటున్నారు.
శివాజీ రాజా పంతం నెగ్గించుకున్నాడు
మా భీమవరంలో నాగబాబు కులం అనే పదం ఉపయోగించాడు. చెప్పుతో కొడతా అన్నాడు, తాటతీస్తా అన్నాడు. ఒక రాజకీయ నాయకుడు అలాంటి పదాలు వాడటం తప్పు. ‘నాగబాబు ఇలాగే మాట్లాడితే అన్ని కులాలు కలిసి ఆయన్ను ఊరి చివరి వరకు తరిమి కొడతారు అని శివాజీ రాజా అప్పట్లో వ్యాఖ్యానించారు. నాగబాబు ఓటమికి కారణమైన అంశాల్లో శివాజీ రాజా వివాదం కూడా ఒకటిగా నిలిచిందని స్పష్టమవుతోంది. శివాజీ రాజా పంతం నెగ్గినట్లయింది.