Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘మా’ కార్యదర్శిగా శివాజీ రాజా; అలీపై గెలుపు
హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో అద్యక్ష పదవిని నటుడు రాజేంద్రప్రసాద్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 87 ఓట్ల తేడాతో జయసుధపై ఆయన విజయం సాధించారు. మరో వైపు ‘మా' కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్ ప్యానెల్ కు చెందిన శివాజీ రాజా విజయం సాధించారు. అలీపై ఆయన విజయం సాధించి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ.... తన గెలుపుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్యానల్ నుండి మొత్తం నలుగురు గెలుపొందినట్లు తెలిపారు. ఎన్నికల ముందు చాలా రాజకీయాలు చోటు చేసుకున్నాయని, న్యాయం తమ వైపు ఉంది కాబట్టే గెలిచామని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.
ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు...
ఎన్నికల ముందు శివాజీ రాజా మాట్లాడుతూ అలీ నమ్మక ద్రోహం చేసాడంటూ వ్యాఖ్యానించారు. ‘మా' ఎన్నికల్లో నువ్వు పోటీ చేస్తే నేను పోటీ చేయను...నేను పోటీ చేస్తే నువ్వు పోటీ చేయొద్దు అని ముందే అనుకున్నాం. అలీ పోటీ చేయనని చెప్పిన తర్వాతే నేను నామినేషన్ వేసాడు. అలీ నమ్మక ద్రోహం చేసాడు. అందుకే నేను నామినేషన్ ఉపసంహరించుకున్నాను. ఇలాంటి పరిస్థితి మాకు రావడం మా ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. మా కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. మరో రెండేళ్ల వరకు అసోసియేషన్ మెట్లు కూడా తొక్కను. రాజేంద్రప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. సేవ చేయాలనే ఉద్దేశ్యం తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. అలీ మోసం చేస్తాడని అనుకోలేదని, మంచు లక్ష్మిపై కావాలనే పోటీ పెట్టలేదన్నారు.
నేను ఎవరి బెదిరింపులకు లొంగే రకం కాదు. మా అసోషియేషన్లో చాలా పదవులు చేపట్టాను. మోహన్ బాబు దగ్గర, మురళీ మోమన్ దగ్గర పని చేసారు. చాలా కష్టపడి పని చేసి అసోసియేషన్కు నిధుల సేకరణలో తొడ్పడ్డాను. ప్రస్తుతం అసోషియేషన్ ద్వారా పేద కళాకారులకు ఎలాంటి న్యాయం జరుగడం లేదు. కొందరు దుర్మార్గులు ఉన్నారు. చాలా తప్పులు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.