Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రామ్ 'శివమ్' సెన్సార్ పూర్తయింది...
హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం "శివమ్". శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో "స్రవంతి" రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. "శివమ్" ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ను ఇచ్చారు. ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - ''ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేశాడు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కించాడు. సెన్సార్ పూర్తయింది. యు/ఎ వచ్చింది. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదల చేస్తున్నాం '' అని చెప్పారు.
"కథాబలం ఉన్న చిత్రం ఇది. స్ర్కీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలను ఇటీవలే విడుదల చేశాం. అన్ని పాటలకూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. విజువల్ గా కూడా పాటలు ఐ ఫీస్ట్ గా ఉంటాయి. ముఖ్యంగా నార్వే, స్వీడన్ లలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన పాటలు చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి.
దర్శకుడు మాట్లాడుతూ "ఇందులో రామ్ లుక్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది. నటన సూపర్బ్. రామ్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. రామ్, రాశీఖన్నా పెయిర్ చూడచక్కగా ఉంటుంది. మామూలుగా సినిమా సక్సెస్ గురించి విడుదలకు ముందు మాట్లాడని దేవిశ్రీ ప్రసాద్ చిత్రం ఆడియో ఫంక్షన్లో "ఈ సినిమా సూపర్ హిట్" అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. పాటలు మాత్రమే కాదు. ఆర్.ఆర్. కూడా ఆయన అద్భుతంగా చేశారు. టెక్నికల్ గా ఈ చిత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. రసూల్ ఫొటోగ్రఫీ హైలైట్ గా నిలుస్తుంది" అని చెప్పారు.
బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.