Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
శివానీ, శివాత్మిక షాకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులను మించి ..
కరోనావైరస్ సంక్షోభం కారణంగా కొనసాగుతున్న 21 రోజుల లాక్డౌన్తో తెలుగు చలన చిత్ర సీమ కార్యకలాపాలు, సినిమాల రిలీజ్ షూటింగులు స్తంభించాయి. అయితే పరిశ్రమలో కార్యక్రమాలు లేకపోవడంతో రోజువారీ వేతన జీవుల పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లో పనిచేసే వారి కోసం జీవిత రాజశేఖర్ కుటుంబం ముందుండి నడుస్తున్నది. ఇతర సినీ ప్రముఖులతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సినీ నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ..
కరోనా సమయంలో బాధితులకు
సినీ పరిశ్రమలో వేతన జీవుల కుటుంబాలను ఆదుకోవడానికి జీవితతో కలిసి నేను సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్నాను. సంక్షోభం మొదలైనప్పటి నుంచి రోడ్ల పక్కన ఉంటే కుటుంబాలకు, వలస కార్మికులకు, తెలుగు సినీ పరిశ్రమలోని వేతన కార్మికులకు అండగా నిలుచున్నాం. వారికి నిత్యావసర వస్తువులను పంపిణి చేస్తున్నాం అని రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.
మేముసైతం అంటూ నా బిడ్డలు శివానీ, శివాత్మికలు
జీవితనే కాకుండా నా కుమార్తెలు శివానీ, శివాత్మికలు కరోనా క్రైసిస్ చారిటీలో భాగమయ్యారు. వారు తాము సంపాదనలో నుంచి చెరో లక్ష రూపాయలు సినీ కార్మికుల ఉపాధి నిధికి విరాళంగా ఇచ్చారు. ఇది చిన్నమొత్తమైనా మా వంతుగా, మా శక్తి మేరకు సంక్షోభం ముగిసే వరకు ఏదో ఒక రూపంలో సహయం చేయాలని భావిస్తున్నాం అని రాజశేఖర్ పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల పంపిణి
కరోనా విలయంపై పోరాటం చేయడానికి తెలుగు పరిశ్రమ అంతా ఐక్యంగా నిలువడం చాలా హ్యాపీగా ఉంది. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను సప్లై చేస్తున్న వారికి, రేయింబవళ్లు పనిచేస్తన్న పోలీసులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో అన్ని వర్గాల వారు అందరికీ అండగా నిలువాలని, వీలైనంత సహాయం చేయాలని కోరుతున్నాను అని రాజశేఖర్ పేర్కొన్నారు.
Recommended Video
శివానీ, శివాత్మిక విరాళం
తెలుగు చలన చిత్రసీమ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల్లో దినసరి వేతన కార్మికులకు అండగా నిలువాలని నిర్ణయించుకొన్నాం. మాతల్లిదండ్రులు జీవిత రాజశేఖర్ అడుగు జాడల్లో నడుస్తూ కరోనా క్రైసిప్ చారిటీకి చెరో లక్ష రూపాయలు విరాళంగా అందించాలని అనుకొంటున్నాం అని శివానీ, శివాత్మిక ఓ ప్రకటనలో తెలిపారు.