Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కోదాడలో 25 రోజులు అదే పని.. నన్ను వదిలేయండి అన్నా ఆ దర్శకుడు వినలేదు: శివాత్మిక
Recommended Video
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక జంటగా నటించిన చిత్రం 'దొరసాని'. ఇటీవలే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది. కాకపోతే హీరోహీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇందులో శివాత్మక 'దొరసాని'గా మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన దొరసాని పలు విషయాలను వెల్లడించింది.
తొలి సినిమాతోనే 'దొరసాని' అనిపించుకొని
సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసింది శివాత్మిక. తొలి సినిమా దొరసాని తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శివాత్మిక. మొదటి సారి కెమెరా ముందుకొచ్చి అత్యద్భుతమైన నటన, హావభావాలతో దొరసాని అయింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాలోనే ఈమె నటనపై సినీ ప్రముఖులతో పాటు పలువురు ప్రశంసలు గుప్పించారు.
కోదాడలో 25 రోజులు
సినిమా షూటింగు కోసం తెలంగాణ పరిసర ప్రాంతమైన కోదాడకు వెళ్ళాం. అక్కడే 25 రోజులు ఉండాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో 'కల్కి' సినిమా షూటింగ్ జరుగుతుండటంతో అమ్మానాన్నలు, అక్కయ్య హైదరాబాదులో ఉండిపోయారు అని చెప్పింది శివాత్మిక.
వరుస రోజులు.. అదే పని
22 రోజుల పాటు వరుసగా షూటింగ్ లో పాల్గొంటూనే ఉన్నాం. అయితే ఒకరోజు నన్ను వదిలేయండి, అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి వస్తాను అంటే దర్శకుడు మహేంద్ర అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత ఆ మరుసటి రోజు ఒకే ఒక్క సీన్ షూట్ చేశారు. ఇది పూర్తికాగానే హైదరాబాద్ వెళ్లిపోదామని అనుకున్నా.. కానీ ఆ సీన్ పూర్తయ్యేసరికి సాయంత్రం 4 అయింది. ఆ సందర్భంలో నాకు మహేంద్రపై వచ్చిన కోపాన్ని కోపాన్ని ఆపుకోలేకపోయా అని చెప్పుకొచ్చింది శివాత్మిక.
దొరసాని మూవీ
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో 'దొరసాని' చిత్ర రూపొందింది.హిస్టారికల్ లవ్ స్టోరీగా చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్బెన్ సినిమాస్ బ్యానర్లపై యశ్ రంగినేని, మధురా శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్బాబు సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చారు.