Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సాయి పల్లవి అతి చేస్తుంది, విజయ్ దేవరకొండ ముద్దు సీన్లు బాగా చేస్తాడు: శోభారాణి
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ మహిళా నేతగా ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు శోభారాణి. ఆ పార్టీ ఇపుడు లేక పోవడంతో ఆమె తెలుగు దేశం పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శోభారాణి గతంలో సెన్సార్ బోర్డ్ మెంబర్గా కూడా పని చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభారాణి సినిమా రంగం గురించి, తన నచ్చిన నటీనటుల గురించి మాట్లాడారు.
పాతకాలంలో అయితే ఎన్టీ రామారావుగారు, నాగేశ్వరరావుగారు ఇలా టాప్ స్టార్స్ అంతా బాగా చేసేవారు. వాళ్లలో చంద్రమోహన్ గారంటే చాలా ఇష్టం. ఆయన సింగిల్ టేక్ లో చేస్తారేమో అనిపిస్తుంది. లోపలి నుంచి ఎక్స్ ప్రెషన్ పలికించినట్లు ఉంటుంది అన్నారు.
ఆ కాలం హీరోలు, హీరోయిన్లలో...
నిన్నటి తరంలో ఎవరి శైలి వారికి ఉన్నప్పటికీ జయసుధగారు అంటే ఇష్టం. ఎంతో అద్భుతమైన నటి. అందుకే ఆమెను సహజనటి అనేవారు. దాసరి నారాయణరావుగారు సావిత్రిగారి తర్వాత అంత ఇస్టాన్ని జయసుధ, జయప్రదపై చూపేవారు. తర్వాత తరంలో విజయశాంతి అంటే ఇష్టం. అప్పటి హీరోల్లో చిరంజీవిగారు అంటే ఇష్టం. ఆయన యాక్టింగుతో పాటు చక్కటి డాన్స్తో అందరినీ దాటేశారు. యాక్టర్లుగా చెప్పాలంటే చిరంజీవి సమకాలీన యాక్టర్లు అందరూ బాగా చేశారు.
విజయ్ దేవరకొండ ముద్దు సీన్లు బాగా చేస్తారు
ఇప్పటి వాళ్లలో అయితే అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ చాలా ఇష్టం. ఎంత సహజంగా చేస్తాడంటే.. ముద్దు సీన్లో కూడా అసభ్యత లేకుండా నటిస్తాడు. అతడు చేసే ఆ సీన్లు ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా నటన ఉంటుంది. ఆ సీన్లో అది చూపిస్తే తప్ప ప్రేక్షకుడు ఊరుకోడు అనే విధంగా బాగా చేస్తాడు అని శోభారాణి చెప్పుకొచ్చారు.
సాయి పల్లవి అతి చేస్తుందేమో
హీరోయిన్లలో ఇపుడు అందరూ బాగా చేస్తున్నారు. నాకు బాధ ఏమిటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు లేరు. తలనిండా మల్లెపూలు పెట్టుకునే వాణిశ్రీ, సావిత్రి లాంటి వారు లేరు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మహానటిలో చేసిన కీర్తి సురేష్ బాగా నచ్చింది. ఫిదాలో సాయి పల్లవి నేచురల్ ఆర్టిస్ట్. కానీ ఆమెలో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేనెలా చేసిన ఫర్వాలేదు అన్నట్లు ఉంటుంది. అలా ఉండకూడదు. బియాండ్ లిమిట్స్ చేసి అతి చేసిందేమో అనిపించుకుంటుంది.
తెలుగుదనం ఉట్టిపడేలా వాళ్ల వరకే
నేను సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఉన్నపుడే రామ్ గోపాల్ వర్మ లాంటి వారితో గొడవ పడేదాన్ని. నీ హీరోయిన్లను తీసుకొచ్చి మా మీద రుద్దకండి అనేదాన్ని. తెలుగుదనం ఉట్టిపడేలాగా రంభ, రాశి, రమ్యకృష్ణ వీళ్ల తరం వరకు అది కనిపించిందని శోభారాణి తెలిపారు.