Don't Miss!
- News మే 10న అక్షయ తృతీయ.. ఈ రాశులపై కనక వర్షం
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
షాక్: స్టార్ హీరో మోకాలికి సర్జరీ,ఆపరేషన్ జరిగేటప్పుడు వీడియో ఇది
ముంబయి: సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్, ఫైటింగ్ సన్నివేశాల కోసం నటీనటులు చాలా కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఊహించని విధంగా గాయపడుతుంటారు. తాజాగా హీరో జాన్ అబ్రహం కూడా ఇలాగే గాయపడి సర్జరీ చేయించుకున్నారు.
తన ట్విట్టర్ ఖాతా ద్వారా జాన్ అబ్రహం ఈ విషయం తెలుపుతూ.. ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు అభిమానుల నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. జాన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
When we say "blood and sweat" goes into a film..we mean it.On my way to 3 knee surgeries while shooting for @Force2thefilm #cameoutstronger pic.twitter.com/3FADatz6dp
— John Abraham (@TheJohnAbraham) November 7, 2016
ఈ వీడియోలో ఆయన మోకాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్న దృశ్యాలున్నాయి. 'ఫోర్స్-2' చిత్రీకరణ సమయంలో మోకాలికి మూడు సర్జరీలు చేయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
'సినిమా చేస్తున్నప్పుడు మేము రక్తాన్ని, స్వేదాన్ని చిందిస్తామనడానికి నిదర్శనం ఇది. 'ఫోర్స్-2' సినిమా చిత్రీకరణ సమయంలో నా మోకాలికి 3 సర్జరీలు చేయించుకున్నా' అని జాన్ అబ్రహం ట్వీట్ చేశారు.
2011లో విడుదలైన 'ఫోర్స్' చిత్రానికి సీక్వెల్గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్నారు. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విపుల్ అమృత్లాల్ షాహ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబరు 18న 'ఫోర్స్-2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. . చిత్రం ట్రైలర్ ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫోర్స్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ మూవీలో ప్రముఖ నటి జెనీలియా కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో వెంకటేశ్ నటించిన 'ఘర్షణ' కు రీమేక్గా ఫోర్స్ ను తెరకెక్కించారు. సోనాక్షిసిన్హా ఇటీవలే అకీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.