Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సాహో గురించి షాకింగ్ న్యూస్, ఇది మాటలు కాదు!
Recommended Video
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన స్టిల్స్ ఏవీ లీక్ కాకుండా 'సాహో' టీమ్ జాగ్రత్తపడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఈరోజు నుండి చిత్ర యూనిట్ కొన్ని యాక్షన్ సన్నివేశాలు దుబాయ్ లో చిత్రికరించబోతున్నారు. 20 నిమిషాల సన్నివేశం కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. నిజంగా ఇది షాకింగ్ న్యూస్. చిన్న ఎపిసోడ్ కు ఇంత ఖర్చు అంటే మాటలు కాదు. బాహుబలి సినిమాకు ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దుబాయ్ షెడ్యూల్ పూర్తి తరువాత హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు యూనిట్.
ఈ మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేయనున్నాడు అనే దానిపై కూడా జోరుగా చర్చ నడుస్తుంది. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు ప్రభాస్. ఈ సినిమా ముందు మొదలుకానుందా ? వేరే దర్శకుడితో సినిమా ఉంటుందా చూడాలి.