Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాకింగ్ న్యూస్: 150వ సినిమా చేయనేమోనన్న చిరంజీవి
హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి తన అభిమానులకు షాకింగ్ మెసేజ్ ఇచ్చారు. ఇటీవలే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవి..... ఇక 150వ సినిమా చేయలేనేమో అని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత బాధ్యత మరింత పెరిగిందని, ఈ నేపథ్యంలో సినిమాల కోసం సమయం కేటాయించడం వీలు కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరంజీవి చివరి సారిగా 2007లో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో నటించారు. అనంతరం తన తనయుడు రామ్ చరణ్ నటించిన 'మగధీర' చిత్రంలోని బంగారుకోడి పెట్ట సాంగులో అతిథి పాత్రలో కనిపించారు. రాజకీయాల్లోకి వెళ్లే నాటికి 149 సినిమాల్లో నటించిన చిరంజీవి చివరగా 150వ సినిమా చేస్తారంటూ వార్తలు వచ్చాయి. మంచి కథ దొరికితే చేస్తానంటూ చిరంజీవి కూడా పలు సందర్భాల్లో ప్రకటించిన అభిమానుల్లో ఆశలు పెంచారు.
తాజాగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక తాను సినిమాల్లోకి రాక పోవచ్చని, 150వ సినిమా చేయక పోవచ్చని చిరంజీవి తేల్చి చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా బిజీ అయ్యానని, పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా తను చేయాల్సినవి చాలా ఉన్నాయని చిరంజీవి తెలిపారు.
2008లో రాజకీయ పార్టీ పెట్టే ముందు చిరంజీవి నటనకు స్వస్థి పలుకుతున్నట్లు ప్రకటించారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత మంచి కథ దొరికితే చేస్తానేమో అంటూ మాట మార్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజకీయాల్లో బిజీ అయ్యాను చేయలేనేమో అంటూ మరో సారి తన అయోమయ పరిస్థితి బయట పెట్టారు. అయితే తాజాగా చేసిన చిరంజీవి చేసిన ప్రకటన ఫైనల్ అనుకోవచ్చని, ఇక ఆయన సినిమాల్లోకి వచ్చే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు అంటున్నారు.