జబర్దస్త్ యాంకర్లకు షాకింగ్ రెమ్యూనరేషన్
హైదరాబాద్: సినిమా రంగంలో అయినా, టెలివిజన్ రంగంలో అయినా...ఒక్కసారి పాపులారిటీ వస్తే అవకాశాలతో పాటు సంపాదన కూడా అమాంతం పెరిగిపోతుంది. జబర్దస్త్ షో ద్వారా పాపుల్ అయిన యాంకర్లు అనసూయ, రష్మిలు ఇపుడు చేతి నిండా సంపాదిస్తూ దూసుకెలుతున్నారు.

బుల్లితెర ద్వారా వీరు ప్రతి తెలుగు కుటుంబానికి సుపరిచయం అయ్యారు. దీంతో ప్రైవేట్ పార్టీలు, ఫంక్షన్లు, కార్పొరేట్ ఈవెంట్ల నిర్వహణకు కూడా వీరికి ఆహ్వానం అందుతోంది. ఇందుకుగాను వారికి భారీగా రెమ్యూనరేషన్లు కూడా అందుతున్నాయి. కార్యక్రమం రేంజిని బట్టి రూ. 50 వేల నుండి రూ. 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట. వీటితో పాటు లగ్జరీ హోటల్స్లో విడిది, ఫ్లైట్ టిక్కెట్స్ లాంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారట.
‘జబర్దస్త్' తొలియాంకర్ అనసూయ....ఆ కార్యక్రమాన్ని వదిలి ఇతర టీవీ షోలు, ప్రైవేట్ కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్స్ చేస్తోంది. రష్మితో పోలిస్తే అనసూయ రెమ్యూనరేషన్ భారీగా ఉందని ఇండస్ట్రీ టాక్.

ఈ యాంకర్లకు భారీగా అభిమానగణం ఉండటం గమనార్హం. అనసూయకు ఫేస్బుక్లో ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్(10 లక్షలు)పైనే ఉండటం గమనార్హం. జబర్దస్త్ షో తర్వాత రష్మి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగి పోయింది. రష్మి ఫ్యాన్స్ కూడా 1 మిలియన్ పైనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











