Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అంటున్నారే..
కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ ఏ స్థాయిలో నష్టపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ ఎఫెక్ట్ తరువాత ప్రేక్షకులకు ముందుకు వచ్చిన మొదటి పెద్ద సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా పెద్దగా పాజిటివ్ టాక్ ను అందుకోలేదు కానీ పరవాలేదు అనే విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఒకవిదంగా సాయి సినిమాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ గట్టిగానే వచ్చింది.
అయితే నెక్స్ట్ సినిమాతో అంతకు మించి అనేలా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఆ ప్రాజెక్ట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ నిన్న విడుదలైన పోస్టర్ వలన ఒక కొత్త రూమర్ వైరల్ గా మారింది. గుర్రాలతో కూడిన రథం పోస్టర్ లో కనిపించడంతో సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రావచ్చని అంటున్నారు.
అయితే ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. సినిమా టైటిల్ ను మోషన్ పోస్టర్ ద్వారా సోమవారం రోజు విడుదల చేయనున్నారు. టైటిల్ విడుదల చేసిన తరువాత ఈ రూమర్స్ పై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాతో పాటు సాయి, సుకుమార్ శిష్యుడు తెరకెక్కిస్తున్న మరో సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ లో రూపొందనుంది. సాయి లైనప్ ను చూస్తుంటే తన స్టైల్ ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది.