Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రేపటి వరకు షూటింగులు రద్దు
దర్శక రత్న దాసరి నారాయణ రావు భార్య, సినీ నిర్మాత దాసరి పద్మ(65) శుక్రవారం మరణించారు. గత కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధ పడతున్న ఆమె యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. పద్మ మరణంతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆమె మృతికి సంతాపంగా శనివారం మధ్యాహ్నం వరకు షూటింగులు రద్దు చేస్తున్నట్లు తెలుగు సినీ సమాఖ్య ప్రకటించింది.
పద్మ మరణం తెలియడంతో సీఎం కిరణ్ దాసరి ఇంటికి చేరుకుని ఆయన్ను ఓదార్చారు. మంత్రులు దానం నాగేందర్, ఏరాసు ప్రతాపరెడ్డి, మోహన్ బాబు, కృష్ణ దంపతులు, జయసుధ, రోజా, కవిత, కళ్యాణ్ రామ్, అశ్వినీ దత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు దాసరి నివాసానికి చేరుకుని పద్మ మృతదేహానికి నివాళులర్పించారు.
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన శివరంజని, మేఘ సందేశం, ఒసేయ్ రాములమ్మ, మజ్ను, ఒరేయ్ రిక్షా సినిమాలకు పద్మ నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా తమిళనాడు మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు.