Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అర్నాబ్ గోస్వామిలా... జర్నలిస్టు పాత్రలో శ్రద్ధా దాస్!
‘పిఎస్వి గరుడ వేగ’ చిత్రానికి సంబంధించి శ్రద్ధా దాస్ పాత్ర పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె కాంటెంపరరీ జర్నలిస్టులో కనిపించబోతున్నారు.
హైదరాబాద్: రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం" . ప్రస్తుతం సినిమా హైదరాబాద్ పాత బస్తి లో చిత్రీకరణను జరుపుకుంటుంది. రాజశేఖర్ ఈ చిత్రంలో ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్లోనే పాతిక కోట్లకు పై భారీ బడ్జెట్తో సినిమా రూపొందుతుంది. మెయిన్ విలన్ జార్జ్ పాత్రలో కిషోర్ నటిస్తున్నాడు. హీరోయిన్ పూజా కుమార్, రాజశేఖర్ భార్య పాత్రలో నటిస్తుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. గుంటూరు టాకీస్ చిత్రంలో శ్రద్ధాదాస్ హిలేరియస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో మరో డిఫరెంట్గా కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి వలే తాను కూడా కావాలని కలలు కనే ఓ యంగ్ జర్నలిస్ట్ మనాలిగా శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో కనిపించబోతోంది. బేసిక్గా శ్రద్ధాదాస్ జర్నలిజం స్టూడెంట్ కావడంతో శ్రద్ధా పాత్రలో ఒదిగిపోయిందని అంటున్నారు చిత్ర యూనిట్.
అదిత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా కీలకపాత్రలో నటిస్తున్నాడు. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్లస్ అవుతుంది. నాజర్, చరణ్ దీప్ తదితరులు రాజశేఖర్ ఎన్ఐఎ టీం సభ్యులుగా నటిస్తున్నారు. ఆదర్శ్, శత్రు, రవిరాజ్లు ప్రొఫెషనల్ కిల్లర్స్ పాత్రలో కనపడనున్నారు. శ్రీనివాస్ అవసరాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాలజిస్ట్ పాత్రలో, పృథ్వీ నింఫోమానియక్ పేషెంట్గా, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే పొలిటిషియన్స్ పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతంః శ్రీచరణ్ పాకాల, బ్యాక్గ్రౌండ్ స్కోర్ః భీమ్స్, సినిమాటోగ్రఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ రగుతు, శ్యామ్, ఎడిటింగ్ః ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్, డేవిడ్ కుబువా, సతీష్, బాబీ అంగారా. పి ఆర్ ఓ : బియాండ్ మీడియా (నాయుడు - ఫణి)