Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరోసారి ప్రభాస్ గురించి శ్రద్ధాకపూర్, అతనిలో ఆ క్వాలిటి నచ్చింది!
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్.. ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్తో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దుబాయ్లో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ కథానాయకిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్తో వర్క్ చేయడం చాలా మంచి అనుభవమని పలు సందర్బాల్లో చెప్పిన శ్రద్దా తాజాగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ... ప్రభాస్ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. ఒక స్టార్ హీరో అనే గర్వం ప్రభాస్లో కాకపోవడం గ్రేట్ అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
ప్రభాస్ ఎప్పుడూ అందరికి అందుబాటులోనే ఉంటారని, ఆయన్ను చేరుకోవడం చాలా సులభమని, ఈ క్వాలిటి ఆయనలో తనకు బాగా నచ్చిందని తెలిపింది శ్రద్దా కపూర్. ప్రభాస్ ఈ సినిమా తరువాత రాధాకృష్ణ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. గోపికృష్ణ మూవీస్ సంస్థలో కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే నేల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది.