Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ప్రభాస్ ‘సాహో’ మూవీ లేటెస్ట్ అప్డేట్స్
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ 'సాహో' అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ మొత్తం హైదరాబాద్ వచ్చేసిన సంగతి తెలిసిందే. అబుదాబి షెడ్యూల్ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో 'సాహో' షెడ్యూల్ ప్లాన్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆర్ఎఫ్సిలో లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
ప్రత్యేకంగా వేసిన మార్కెట్ సెట్లో షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్తో పాటు కీలక తారాగణంపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నలభై రోజులకు పైగా ఈ షెడ్యూల్ జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో కొన్ని యాక్షన్ సీన్లు కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
'సాహో' సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ కానున్నాయి. 60 రోజుల అబుదాబిలో రూ. 90 కోట్ల రూపాయల ఖర్చుతో వీటిని చిత్రీకరించారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం ఈ సీన్ల కోసమే కేటాయించడం గమనార్హం.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2019లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.