twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ‘సాహో’ మూవీ లేటెస్ట్ అప్డేట్స్

    By Bojja Kumar
    |

    ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ 'సాహో' అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ మొత్తం హైదరాబాద్ వచ్చేసిన సంగతి తెలిసిందే. అబుదాబి షెడ్యూల్ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో 'సాహో' షెడ్యూల్ ప్లాన్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆర్ఎఫ్‌సిలో లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

    ప్రత్యేకంగా వేసిన మార్కెట్‌ సెట్‌‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌‌తో పాటు కీలక తారాగణంపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నలభై రోజులకు పైగా ఈ షెడ్యూల్‌ జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో కొన్ని యాక్షన్ సీన్లు కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

    Shraddha Kapoor begins shooting for Sahoo

    'సాహో' సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ కానున్నాయి. 60 రోజుల అబుదాబిలో రూ. 90 కోట్ల రూపాయల ఖర్చుతో వీటిని చిత్రీకరించారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం ఈ సీన్ల కోసమే కేటాయించడం గమనార్హం.

    యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2019లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Shraddha Kapoor begins shooting for Sahoo. After the wrap of an extensive second schedule in Dubai, the makers have now constructed a unique set for the movie in Ramoji Film City. The Saaho team is slated to shoot the third schedule for 40 days in Hyderabad. The film was shot in Dubai for over two months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X