Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లైంగిక వేధింపులంటే నవ్వులాటయ్యింది.. తనకెదురైన అనుభవం అంటూ శ్రద్దా సెన్సేషనల్ కామెంట్స్
Recommended Video
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఎన్ని విప్లవాలు వచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సమాజంలోని అన్ని ఇతర పరిశ్రమలతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ దుశ్చర్య రాజ్యమేలుతోంది. అందుకే ఈ విషయమై సరికొత్త విప్లవం రావాలని చెబుతూ తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించింది శ్రద్దా శ్రీనాథ్. ఆ వివరాలు చూస్తే..
జెర్సీ భామ శ్రద్దా శ్రీనాథ్
తెలుగులో ఇటీవలే నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' సినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి బ్రేక్ తెచ్చుకుంది. గ్లామర్, రొమాన్స్, ఇంటి ఇల్లాలు ఇలా ఏ పాత్రలోనైనా తాను ఒదిగిపోగలనని కేవలం ఈ ఒక్క సినిమాతోనే రుజువు చేసింది శ్రద్దా శ్రీనాథ్.
కెరీర్ ప్రారంభంలోనే క్రేజ్
తెలుగు తెరకు పరిచయం కాకముందే శ్రద్ద శ్రీనాథ్ తన సొంత భాష కన్నడలో యూ టర్న్, తమిళంలో విక్రమ్ వేద సినిమాల్లో నటించింది. క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించడంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. దీంతో వరుస సౌత్లో అవకాశాలు పట్టేసిన ఈమె తాజాగా తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్' సినిమాలో నటించింది.
‘నేర్కొండ పార్వాయ్'.. శ్రద్దా రెస్పాన్స్
‘నేర్కొండ పార్వాయ్' సినిమాలో నటించిన పాత్రలో ఆమెపై లైంగిక వేధింపులు జరుగుతాయి. ఆ సమయంలో తనకు నిర్భయకు సంబంధించిన ఆలోచనలే మెదడులో మెదిలాయని తెలిపింది. ఏ అమ్మాయైనా తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పగానే.. ఎలా జరిగిందని ఆమెనే అడుగుతారే తప్ప నిందితులను ఏమీ అనరు. ప్రస్తుత సమాజంలో లైంగిక వేధింపులంటే నవ్వులాటయింది. ఆ మనోవేదనను కళ్ళకుగట్టినట్టు చూపించే సినిమానే ఇది అని శ్రద్దా పేర్కొంది.
తనకెదురైన ఓ అనుభవం గురించి
సందర్భంగా తనకెదురైన ఓ అనుభవం గురించి చెప్పింది శ్రద్దా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ' ఘటన జరిగిన వారం రోజుల తర్వాత తన ఇంటర్న్షిప్ కోసమై ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, అప్పుడు మా అమ్మానాన్నలు భయపడ్డా కూడా తాను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నానని చెప్పింది శ్రద్దా శ్రీనాథ్.