Don't Miss!
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
అడవి మధ్యలో శ్రియ
హిమాలయాల దగ్గర ఒక సాధువు నుంచి శ్రియ కొన్ని పూసలు తీసుకున్నారట. అనంతరం పొండిలో గల 'మాత్రి మందిర్'లో ఆమె ధ్యానం చేశారు. "ధ్యానం వల్ల నా మనసంతా తేలికయ్యింది. నూతనోత్సాహం ఏర్పడిన భావం కూడా కలిగింది' అని అంటున్నారు శ్రియ.
అందుకని ఇకనుంచి ధ్యానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారామె. దీనికోసం కోయంబత్తూరులో యోగా, ధ్యానంకి సంబంధించి జరిగిన 'వర్క్షాప్'లో కూడా ఆమె పాల్గొన్నారు. దీని గురించి శ్రియ చెబుతూ-"కోయంబత్తూరులో ఉన్న ఒక ప్రముఖ యోగా గురువు ద్వారా ఈ వర్క్షాప్ గురించి తెలిసింది. అందులో పాలుపంచుకోవడం ద్వారా ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది.
ఈ క్యాంప్లో ఎంతోమంది పాల్గొన్నారు. ఒక అడవి మధ్యలో వర్క్షాప్ జరిగింది. తెల్లవారుఝామునే నిద్ర లేచేదాన్ని. ఆ తర్వాత యోగాసనాలు మొదలుపెట్టేవాళ్లం. ఆసనాలన్నీ పూర్తి చేసిన తర్వాత శరీరం తేలికగా అనిపించేది. టెన్షన్ నుంచి విముక్తి పొందడానికి యోగా బాగా ఉపయోగపడుతుంది' అని చెప్పారు శ్రియ.
ఇక శ్రియ మల్లన్న(కందసామి) చిత్రంపైనే ఇప్పుడందరి దృష్టి ఉంది. అందులోనూ చాలా కాలం విక్రమ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమాలో విక్రమ్ రకరకాల గెటప్ లలో కనపడనున్నారు. ఇక సుశీగణేషన్ దర్శకత్వంలో కలై పులి థాను నిర్మిస్తున్న ఈ చిత్ర కథ కూడా ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విక్రమ్ పాత్ర అందరినీ ఆదుకునే రాభిన్ హుడ్ తరహాలో వెళ్తుందని తెలుస్తోంది. అలాగే కథ ప్రకారం జనం తమ కష్టాలని, భాధలని చీటీలపై రాసి ఓ ప్రముఖ దేవాలయం వద్ద నున్న మర్రిచెట్టుకి వేళ్ళాడ తీస్తారుట.
వాటిని చదివే విక్రమ్ తన దైన శైలిలో పరిష్కరస్తూ వారి దృష్టిలో దేవుడిలా ఎదుగుతాడుట. వారంతా దైవం మల్లన్నే ఈ పనులన్నీ చేసాడని భావిస్తూంటారుట. ఇక ఈ సినిమా పూర్తి హాలివుడ్ స్టైల్స్ తో నిండి ఉంటుందిట. అంతేగాక ఈ చిత్రంలో విక్రమ్ లేడీ గెటప్ లో కూడా కనపడి కనువిందు చేయనున్నాడు. ఇక శ్రియ అతన్ని మొదట అడ్డుకున్న తర్వాత అతనికి సహరిస్తూ గ్లామర్ కురిపిస్తూంటుందిట. అంటే 'అపరిచితుడు' లో ఇంటర్ నెట్ కు బదులు ఇక్కడ మర్రిచెట్టు వస్తుందన్నమాట. ఇక ఈ సినిమా గురించి విక్రమ్ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆయన చెప్పే దాని ప్రకారం హాలీవుడ్ తరహాలో ఇండియన్ జేమ్స్ బాండ్ లా మల్లన్న కనపడతాడుట.కాగా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఏకాంబరం సినిమాటోగ్రాఫర్. అత్యంత భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు థాను.