Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అడవి మధ్యలో శ్రియ
హిమాలయాల దగ్గర ఒక సాధువు నుంచి శ్రియ కొన్ని పూసలు తీసుకున్నారట. అనంతరం పొండిలో గల 'మాత్రి మందిర్'లో ఆమె ధ్యానం చేశారు. "ధ్యానం వల్ల నా మనసంతా తేలికయ్యింది. నూతనోత్సాహం ఏర్పడిన భావం కూడా కలిగింది' అని అంటున్నారు శ్రియ.
అందుకని ఇకనుంచి ధ్యానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారామె. దీనికోసం కోయంబత్తూరులో యోగా, ధ్యానంకి సంబంధించి జరిగిన 'వర్క్షాప్'లో కూడా ఆమె పాల్గొన్నారు. దీని గురించి శ్రియ చెబుతూ-"కోయంబత్తూరులో ఉన్న ఒక ప్రముఖ యోగా గురువు ద్వారా ఈ వర్క్షాప్ గురించి తెలిసింది. అందులో పాలుపంచుకోవడం ద్వారా ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది.
ఈ క్యాంప్లో ఎంతోమంది పాల్గొన్నారు. ఒక అడవి మధ్యలో వర్క్షాప్ జరిగింది. తెల్లవారుఝామునే నిద్ర లేచేదాన్ని. ఆ తర్వాత యోగాసనాలు మొదలుపెట్టేవాళ్లం. ఆసనాలన్నీ పూర్తి చేసిన తర్వాత శరీరం తేలికగా అనిపించేది. టెన్షన్ నుంచి విముక్తి పొందడానికి యోగా బాగా ఉపయోగపడుతుంది' అని చెప్పారు శ్రియ.
ఇక శ్రియ మల్లన్న(కందసామి) చిత్రంపైనే ఇప్పుడందరి దృష్టి ఉంది. అందులోనూ చాలా కాలం విక్రమ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమాలో విక్రమ్ రకరకాల గెటప్ లలో కనపడనున్నారు. ఇక సుశీగణేషన్ దర్శకత్వంలో కలై పులి థాను నిర్మిస్తున్న ఈ చిత్ర కథ కూడా ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విక్రమ్ పాత్ర అందరినీ ఆదుకునే రాభిన్ హుడ్ తరహాలో వెళ్తుందని తెలుస్తోంది. అలాగే కథ ప్రకారం జనం తమ కష్టాలని, భాధలని చీటీలపై రాసి ఓ ప్రముఖ దేవాలయం వద్ద నున్న మర్రిచెట్టుకి వేళ్ళాడ తీస్తారుట.
వాటిని చదివే విక్రమ్ తన దైన శైలిలో పరిష్కరస్తూ వారి దృష్టిలో దేవుడిలా ఎదుగుతాడుట. వారంతా దైవం మల్లన్నే ఈ పనులన్నీ చేసాడని భావిస్తూంటారుట. ఇక ఈ సినిమా పూర్తి హాలివుడ్ స్టైల్స్ తో నిండి ఉంటుందిట. అంతేగాక ఈ చిత్రంలో విక్రమ్ లేడీ గెటప్ లో కూడా కనపడి కనువిందు చేయనున్నాడు. ఇక శ్రియ అతన్ని మొదట అడ్డుకున్న తర్వాత అతనికి సహరిస్తూ గ్లామర్ కురిపిస్తూంటుందిట. అంటే 'అపరిచితుడు' లో ఇంటర్ నెట్ కు బదులు ఇక్కడ మర్రిచెట్టు వస్తుందన్నమాట. ఇక ఈ సినిమా గురించి విక్రమ్ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆయన చెప్పే దాని ప్రకారం హాలీవుడ్ తరహాలో ఇండియన్ జేమ్స్ బాండ్ లా మల్లన్న కనపడతాడుట.కాగా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఏకాంబరం సినిమాటోగ్రాఫర్. అత్యంత భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు థాను.