twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిషకే కాదు ...శ్రియకు ఛాన్సిచ్చాడు

    By Staff
    |

    Shreya
    మొత్తానికి కమల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించటానికి ప్లాన్ చేస్తున్న మర్మయోగిలో మొత్తానికి శ్రియాకు కూడా ఛాన్స్ దొరికింది. కమల్ క్యాంప్ నుంచి వచ్చిన అనధికార సమాచారం ప్రకారం శ్రియ ఆ సినిమాకు లేటెస్ట్ గా సైన్ చేసింది. అయితే త్రిషే మెయిన్ హీరోయిన్ అని,శ్రియ సెకెండ్ హీరోయిన్ అని అంటున్నారు. అయితే శ్రియాభిలాషులు మాత్రం శియ పాత్రే సినిమాకు ప్రాణమని అందుకే ఒప్పుకుందని చెప్తున్నారుట. ఇంతకీ శ్రియ పాత్ర వచ్చేది ప్లాష్ బ్యాక్ లోనట. ఆమె కమల్ భార్యట. అయితే ఆమె తర్వాత త్రిషను చేసుకుంటాడుట.

    ప్రస్తుతం హీరోయిన్లు త్రిష,శ్రియ మధ్య పోటీ హోరా హోరీగా నడుస్తోందన్న సంగతి తెలిసిందే. దాంతో సహజంగా వీరిద్దరూ కమల్ మర్మయోగి చిత్రానికి పోటీ పడ్డారు. అయితే త్రిష తన టాలెంటుతో అవకాశాన్ని గద్దలా తన్నుకు పోయింది. దాంతో డైలమాలో పడ్డ శ్రియకు కమల్ న్యాయమే చేసాడంటున్నారు. ఓదార్చటానికే ఆమెకూ తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారుట. అయితే శ్రియ మొదట దాన్ని తిరస్కరించిందిట.

    అయితే కమల్ ఏం చెప్పాడో ఏమో గానీ వెంటనే శ్రియ దాన్ని ఓకె చేసి సైన్ చేసేసిందిట. అడ్వాన్స్ రెమ్యునేషన్ వంటివి కూడా అడగలేదుట. దాంతో అంతా కమల్ ని వాహ్ కమాల్ అన్నట్లు చూసారుట. ఇక ఈ సినిమాకోసం హేమమాలిని కూడా చిర కాల విరామం తర్వాత ముఖానికి మేకప్ వేసుకోనుంది. అలాగే ఈ సినిమాకి కెమెరా కోసం హాలీవుడ్ నుండి నిపుణులను రప్పించేపనిలో కమల్ ఉన్నాడుట. అక్టోబర్ 19 న ముంబయి లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. అలాగే అదే నెలాఖరులో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X