Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రజనీ అల్లుడి కోసం... ఎన్టీఆర్కు ఝలక్?
జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా దమ్ము నుంచి శృతి హాసన్ అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో షూటింగ్ ప్రారంభం అయ్యాక కొన్ని రోజులు షూటింగులో పాల్గొని మరీ...ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది శృతి హాసన్. అయితే శృతి ఇలా చేయడం వెనక చాలా పెద్ద కారణమే ఉంది. వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్లనే నావల్ల కాక దమ్ము నుంచి తప్పుకున్నానని శృతి హాసన్ చెబుతున్నప్పటికీ, దీని వెనక మరోకారణం కూడా ఉందనేది చెన్నయ్ సినీ వర్గాల సమాచారం.
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త ధనుష్ హీరోగా '3" సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్గా నటింప చేయాలని భావించింది. తన సినిమా స్క్రిప్టు గురించి శృతి హాసన్ కు చెప్పింది. ఐశ్వర్య చెప్పిన కథ ఆమెకు చాలా నచ్చింది. అయితే అప్పటికే సెవెన్త్ సెన్స్, ఓమై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ తదితర చిత్రాలతో బిజీగా ఉండటంతో పాటు అంతకు ముందే ఎన్టీఆర్ దమ్ము సినిమాకు కూడా సైన్ చేసింది. దీంతో తనకు నటించడం వీలు కాదని చెప్పేసింది శృతి.
అయితే....ఐశ్వర్య చెప్పిన కథ బాగా నచ్చడం ఒక పాయింట్ అయితే, రజనీ కాంత్ అల్లుడు ధనుష్ తో చేస్తే తనకు సొంత గడ్డ తమిళనాడులో మంచి స్టార్ డమ్ వస్తుందనే ఆలోచనలో పడ్డ శృతి హాసన్ చివరకు......జూనియర్ ఎన్టీఆర్ కు ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఏదో సాకు చెప్పి దమ్ము దర్శక, నిర్మాతలను ఒప్పించింది.
అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పరువు పోయిందని ఫీలవుతున్నారు ఆయన అభిమానులు. జూనియర్ లాంటి టాప్ హీరోను కాదని శృతి హాసన్ లాంటి ఓ మోస్తరు హీరోయిన్ వెళ్లి పోవడం పరువు తక్కువ విషయం కాక పోతే మరేమిటి? అని మదన పడుతున్నారు.