Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రానాను పట్టేసిన శృతిహాసన్.. ముంబైలో ఆ ముగ్గురు హల్చల్.. మరొకరు ఎవరంటే!
Recommended Video
అందాల భామ శృతిహాసన్ మళ్లీ విజృంభించేందుకు రెడీ అవుతున్నారు. ఆమె కొద్దికాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. 2017 నుంచి ఆమె తెలుగులో నటించిన దాఖాలాలు లేవు. గతకొద్దికాలంగా కెరీర్ బ్రేక్ చెప్పిన ఈ బ్యూటీ మళ్లీ అవకాశాలను అందిపుచ్చుకొంటున్నారు. తాజాగా ముంబైలో రానా దగ్గుబాటి, రాఘవేంద్రరావు తనయుడు, దర్శకుడు ప్రకాశ్ కొవెలమూడి కలిసి హంగామా చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరి కలయిక వెనుక మతలబు ఏంటంటే..
యూఎస్ సిరీస్కి గ్రీన్ సిగ్నల్
పవన్ కల్యాణ్తో కాటమ రాయుడు సినిమాతో సినీ పరిశ్రమకు దూరమై.. ఇటీవలకాలంలో శృతి హాసన్ మళ్లీ ట్రాక్పైకి వచ్చేసింది. హాలీవుడ్లో శృతి హాసన్ ఓ అమెరికన్ సిరీస్కు ఒకే చెప్పడం ద్వారా ఓ పెద్ద ఆఫర్ను చేజిక్కించుకొన్నారు. త్వరలోనే ట్రెడ్స్టోన్ అనే సిరీస్లో కనిపించనున్నారు. అంతేకాకుండా దక్షిణాదిలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రానా, ప్రకాశ్తో సమావేశం కావడం ఓ వార్త హల్చల్ చేసింది.
క్రేజీ ప్రాజెక్ట్ కోసం చర్చలతో
మీడియా సమాచారం ప్రకారం.. ముంబైలో ఉంటున్న శృతిహాసన్ను కలుసుకోవడానికి రానా, ప్రకాశ్ కోవెలమూడి వెళ్లారు. ఏదో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చ జరిగింది. ఈ ముగ్గురు కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం సంప్రదింపులు చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. త్వరలోనే రానా, శృతితో ప్రకాశ్ సినిమా చేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ ముగ్గురు కలయికలో ఓ జోష్ మాత్రం కనిపించింది.
ప్రియుడితో బ్రేకప్ తర్వాత కెరీర్పై
బ్రిటన్లోని రాక్ బ్యాండ్ సభ్యుడైన మైఖేల్ కోర్సలేతో కొద్దికాలంగా సన్నిహితంగా మెదిలింది. ఆ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దాదాపు వారిద్దరూ వ్యవహారం పెళ్లి వరకు వచ్చేసినట్టు కనిపించింది. అయితే అనూహ్యంగా వారిద్దరూ తమ అఫైర్కు బ్రేకప్ చెప్పేశారు. దాంతో శృతి అటు మ్యూజిక్, ఇటు సినిమా అవకాశాలపై దృష్టి పెట్టింది. ఇటీవల లండన్లో మ్యూజిక్ బ్యాండ్ కార్యక్రమంలో శృతిహాసన్ ఇరుగదీసిన సంగతి తెలిసిందే.
వరుస అవకాశాలు చేజిక్కించుకొనే దిశగా
శృతిహాసన్ కెరీర్ విషయానికి వస్తే, అమెరికా సిరీస్ ట్రెడ్ స్టోన్తోపాటు విజయ్ సేతుపతితో లాడమ్ అనే సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. ఇంకా కొన్ని ఆఫర్లను కమిట్ కావాల్సిందనే మీడియా రిపోర్ట్.