Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిర్మాతగా మారుతున్న శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్ నిర్మాతగా మారబోతోంది. చాలా రోజుల క్రితమే 'ఇసిడ్రో మీడియా' అనే బేనర్ స్థాపించిన చెన్నై బ్యూటీ డిజిటల్ మీడియాలో క్రియేటివ్ కంటెంట్ అందించడమే లక్ష్యంగా తన సంస్థను విస్తరించడానికి చాలా పెద్ద ప్లాన్సే వేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు ఆమె బేనర్లో తొలి ప్రాజెక్టు రాబోతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ తర్వాతి మూవీ 'ది మస్కిటో ఫిలాసఫీ' చిత్రాన్ని శృతి హాసన్ నిర్మించబోతోంది. దీనికి సమర్పకురాలిగా కూడా ఆమెనే వ్యవహరించనుండటం విశేషం.
డిఫరెంట్ కంటెంటుతో వచ్చే చిత్రాలను ఇసిడ్రో మీడియాపై నిర్మించాలని నిర్ణయించుకున్నాం. కొత్త ఆలోచనలు, కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా ఇసిడ్రో మీడియా ముందుకు సాగుతుందని శృతి హాసన్ తెలిపారు.
దర్శకుడు జయప్రకాష్ ఎంతో ప్రతిభ ఉన్న ఫిల్మ్ మేకర్ అని, చాలా సింపుల్ స్టోరీస్ కూడా ఆయన తరపై ఎంతో అద్భుతంగా చూపిస్తారు. అతడి చివరి ప్రాజెక్ట్ 'లెన్స్' నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతడు తీస్తున్న 'ది మస్కిటో ఫిలాసఫీ' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను అని శృతి హాసన్ తెలిపారు.