Don't Miss!
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'ఎవడు' చిత్రం ఫొటోలు లీక్: శృతిహాసన్ కేసు పెడుతోంది
శృతి మాట్లాడుతూ... నన్ను చాలా మంది అడుగుతున్నారు..అలాంటి అసభ్యకరమైన ఫోజ్ ఎందుకు ఇచ్చావంటూ... వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్దం కావటంలేదు. నిజం ఏమిటంటే ఇలాంటి చీప్ పబ్లిసిటీని నేను ఎప్పుడూ నమ్మను. ఇలాంటివి జరుగుతాయని నేను ఊహించలేదు. అలాగే నేను హైదరాబాద్ లో ఈ విషయమై ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యబోతున్నాను అని తేల్చి చెప్పింది. అలాగే తాను ఈ ఇష్యూలో ఎంతదాకా అయినా వెళ్తానని, ఎలాగయినా ఈ ఫొటోలు అప్ లోడ్ చేసిందెవరో తెలుసుకుంటానని చెప్పింది. ఇది నమ్మకానికి సంభందించిన సమస్య అంది.
ఇక ఓ వైపు హిట్ చిత్రాలు.. మరోవైపు స్టార్ హీరోలతో అవకాశాలు.. ఇలా శృతి ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది. హిందీలో 'లక్' ద్వారా కెరీర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ... టాలీవుడ్లో సూర్యకు జంటగా '7ఆమ్ అరివు'తో తెరంగేట్రం చేసింది. ఆదిలో అపజయాల హీరోయిన్గా ముద్రపడినా.. తెలుగులో 'గబ్బర్సింగ్'తో ఆ పేరు తుడిచిపెట్టుకుపోయింది. ఆ జోరు కొనసాగిస్తూ రవితేజతో 'బలుపు', రామ్చరణ్తో 'ఎవడు', తాజాగా అల్లుఅర్జున్తో 'రేసుగుర్రం'... ఇలా వరుస హిట్లను అందుకుంది.
ప్రస్తుతం తమిళంలో విశాల్తో 'పూజై' నటిస్తుండగా, సూర్యతో ఓ చిత్రం, అలాగే మణిరత్నం మహేష్ - నాగార్జునలతో తెరకెక్కించనున్న సినిమాలోనూ శ్రుతిహాసన్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా.. హిందీలో అక్షయ్కుమార్తోనూ, 'గబ్బర్'లో జాన్ అబ్రహంతోనూ నటిస్తోంది. ఇలా మూడు భాషల్లో హిట్లు అందుకోవటమే కాకుండా.. అందరూ స్టార్ హీరోలతో నటించటంపై చాలా ఖుషీలో ఉందట శ్రుతి.
అక్కడా.. ఇక్కడా.. అంటూ విరామం లేకుండా షూటింగ్లో పాల్గొంటున్నా.. ఇష్టమైన కష్టం కూడా ఎంతో హాయి అంటూ సన్నిహితుల వద్ద సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో కొన్నైనా విజయాల బాట పడితే.. ఇప్పట్లో శ్రుతిహాసన్కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.