Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తమన్నా కి ట్విస్ట్.... ఆ ప్లేస్ లోకి శ్రుతిహాసన్
ముంబై: శృతిహాసన్ టైమ్ మొదలైంది. గబ్బర్ సింగ్ తర్వాత ఆమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. బలుపు విజయంతో ఆమెకు తెలుగులోనూ హవా మొదలైంది. మరోప్రక్క రామయ్య వస్తావయ్యా, డి డే విజయం సాధించటంతో బాలీవుడ్ సైతం ఆమెను కన్సిడర్ చేస్తోంది. ఈ నేపధ్యంలో తమన్నాకు అనుకున్న ప్రాజెక్టు ...శ్రుతిహాసన్ కి చేరింది.
విజయకాంత్ ప్రధానపాత్రధారిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో గతంలో విడుదలైన చిత్రం 'రమణ'. ఆ చిత్రం తెలుగులో ఠాగూర్ పేరుతో విడుదలై ఇక్కడా మంచి విజయం సాధించింది. అవినీతి వ్యతిరేక కథాంశంతో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది.
అక్షయ్కుమార్ హీరో . క్రిష్ దర్శకుడు. అక్షయ్కి జంటగా తమన్నా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ అవకాశం కమల్ గారాలపట్టి శ్రుతిహాసన్ను చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాణవర్గాలు కూడా ధ్రువీకరించాయి. శ్రుతిహాసన్ హీరోయిన్ గా బాలీవుడ్లో కెరీర్ను ప్రారంభించింది. 'లక్' ద్వారా వచ్చిన ఆమెకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రుతికి ఈసారి ఎలాంటి ఫలితం ఎదురవుతుందో వేచిచూడాలి.