Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తమన్నా కి ట్విస్ట్.... ఆ ప్లేస్ లోకి శ్రుతిహాసన్
ముంబై: శృతిహాసన్ టైమ్ మొదలైంది. గబ్బర్ సింగ్ తర్వాత ఆమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. బలుపు విజయంతో ఆమెకు తెలుగులోనూ హవా మొదలైంది. మరోప్రక్క రామయ్య వస్తావయ్యా, డి డే విజయం సాధించటంతో బాలీవుడ్ సైతం ఆమెను కన్సిడర్ చేస్తోంది. ఈ నేపధ్యంలో తమన్నాకు అనుకున్న ప్రాజెక్టు ...శ్రుతిహాసన్ కి చేరింది.
విజయకాంత్ ప్రధానపాత్రధారిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో గతంలో విడుదలైన చిత్రం 'రమణ'. ఆ చిత్రం తెలుగులో ఠాగూర్ పేరుతో విడుదలై ఇక్కడా మంచి విజయం సాధించింది. అవినీతి వ్యతిరేక కథాంశంతో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది.
అక్షయ్కుమార్ హీరో . క్రిష్ దర్శకుడు. అక్షయ్కి జంటగా తమన్నా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ అవకాశం కమల్ గారాలపట్టి శ్రుతిహాసన్ను చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాణవర్గాలు కూడా ధ్రువీకరించాయి. శ్రుతిహాసన్ హీరోయిన్ గా బాలీవుడ్లో కెరీర్ను ప్రారంభించింది. 'లక్' ద్వారా వచ్చిన ఆమెకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రుతికి ఈసారి ఎలాంటి ఫలితం ఎదురవుతుందో వేచిచూడాలి.