Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
పంజా పనైపోయింది...గబ్బర్ సింగ్ పనిబట్టారు పవన్...!
సినిమా షూటింగ్ పూర్తి చేసి, డబ్బింగ్ చెప్పేయడంతో ఓ సినిమాకి తనవంతుగా పని అయిపోయిందని భావించే పవన్ కళ్యాణ్ 'పంజా" చిత్రం పవన్ ముగించుకుని గబ్బర్ సింగ్ పనితో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రం పొల్లాచిలో షూటింగ్ జరుపుకుంటోంది.
సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ 'దబాంగ్" సినిమాకి రీమేక్ అయిన గబ్బర్ సింగ్ వచ్చే వేసవిలో విడుదల కానుంది. గణేష్ బాబు నిర్మాణం లో శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. రీసెంట్ గా శృతి హాసన్ నటించడం లేదని ఆమె ప్లేస్ లో ఇలియానా నటిస్తోందన్న రూమర్ కి ఫుల్ స్టాప్ పెడుతూ శృతి హాసన్ ఈ రోజు నుండి షూటింగ్ లో పాల్గొంటోంది. పొల్లాచిలో పవన్ కళ్యాన్, శృతి హాసన్ లతో ముఖ్యమైనటువంటి కొన్ని సీన్స్ మరియు సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం.
చిత్రమైన క్యారెక్టర్ ఉన్న పోలీస్ గా ఇందులో పవన్ కనిపిస్తాడు. దబాంగ్ లో హీరో క్యారెక్టరైజేషన్ బాగా నచ్చడంతో పవన్ ఈ సినిమా రీమేక్ చేయడానికి అంగీకరించాడు. పంజా విషయంలో పూర్తి సంతృప్తి లభించడంతో నటుడిగా 'గబ్బర్ సింగ్" చిత్రాన్ని ఇంకాస్త జోష్ తో చేస్తున్న పవన్ వరుసగా రెండు హిట్లు కొడతారేమో చూద్దాం.