Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గంటలోనే: శృతిహాసన్ టాలెంట్ చూసి షాక్
హైదరాబాద్: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు శృతి హాసన్ మ్యూజిక్ డైరెక్టరుగా, సింగర్ గా రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇటు దక్షిణాది సినిమాలతో పాటు అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్న శృతి హాసన్ తను నటిస్తున్న బాలీవుడ్ సినిమాలో పాట పాడింది. ఆ పాటకు ఓ ప్రత్యేకత కూడా ఉంది.
శృతిహాసన్ నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్' కోసం ఓ సాంగ్ ను పాడింది. శృతి పాడిన పాట ఎలాంటి గ్యాప్ లేకుండా ఒక గంట సమయంలో రికార్డింగ్ పూర్తి చేసిందట. శృతి నటిస్తున్న తమిళ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతుంది. పొల్లాచ్చిలో షూటింగ్ ముగియగానే ఇంటికి వెళ్లలేదట. అక్కడి నుంచి నేరుగా ముంబయిలోని రికార్డింగా థియేటర్కు చేరుకుని కేవలం హాఫ్ డే లోనే ఎలాంటి బ్రేకు లేకుండా ఈ సాంగ్ ను సక్సెస్పుల్గా కంప్లీట్ చేసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ప్రస్తుతం శృతి హాసన్ నటిస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే....బాలీవుడ్ నాలుగు సినిమాలు, తమిళంలో ఒకటి, తెలుగులో ఒక సినిమా చేస్తోంది. తెలుగు ఆమె మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇక బాలీవుడ్లో యాత్ర, వెల్ కం బ్యాక్, గబ్బర్ ఈజ్ బ్యాక్, రాకీ హాండ్సమ్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో ‘పులి' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె కెరీర్ గ్రాఫ్ సంతృప్తి కరంగా సాగుతోంది.