హీరోయిన్ శృతి హాసన్ త్వరలో హైదరాబాద్ కు మకాం మారుస్తోంది. ఇందు కోసం ఇప్పటి నుంచే హైదరాబాద్ లో ఓ మంచి ఇంటిని వెతికే ప్రయత్నం మొదలు పెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాకు చాలా ఇస్టమైన ప్రదేశమని, దేశంలోని అందనమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని తెగ పొగిడేస్తోంది. ఓ మై ఫ్రెండ్ సినిమా ద్వారా తెలుగులో తొలిసారిగా ఓ మంచి విజయం సొంతం చేసుకున్న శృతి, ఇక్కడ మరింతగా రాణించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. శృతి హాసన్ ప్రస్తుతం పవన్ కళ్యాన్ తో కలిసి గబ్బర్ సింగ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఓ పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తోంది. శృతి కెరీర్ లో ఇలాంటి పాత్రను పోషించడం ఇదే తొలిసారి. ఈ సినిమా 2012 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు తమిళంలో '3" అనే చిత్రంలో ధనుష్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి రజనీకూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో నటించడానికి తొలుత ఓకే చెప్పిన శృతి అర్ధాంతరంగా ఆ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.