Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శుభలేఖ+లు ట్రైలర్ రివ్యూ: డబ్బు కోసం యూఎస్ మీద.. అమ్మాయిల కోసం ఇండియాపై!
Recommended Video
టాలీవుడ్లో ప్రేక్షకుల అభిరుచిలో విశేషంగా మార్పు కనిపిస్తున్నది. భారీ బడ్జెట్ చిత్రమా? లేదా చిన్న బడ్జెట్ సినిమానా అని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న సినిమాలపై మంచి ఆదరణ చూపిస్తూ అందలం ఎక్కిస్తున్నారు. అలాంటి కోవలోనే తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతని పంచడానికి వస్తున్న చిత్రం శుభలేఖ+లు. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజై సినీ అభిమానులను ఆకట్టుకొంటున్నది.
నేటితరం యువత ఆధునిక పోకడలను ఓ వైపు చూపిస్తూనే మరో వైపు పెళ్లి ప్రధానాశంగా సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తున్నది. పెళ్లి సంబంధం మంచి టెప్టింగ్ ఉంది అని ఓ యువతి.. ఎన్నారైలేంటే.. డబ్బు కోసం అమెరికా మీద.. అమ్మాయిల కోసం ఇండియాపైనా పడుతుంటారని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి.
ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకొనేందుకు సంప్రదాయ పద్దతులను జొప్పించినట్టు కనిపించింది. అలాగే బోల్డ్ కంటెంట్ను ఆశించే యూత్ను ఏ మాత్రం నిరాశకు గురిచేయకుండా దర్శకుడు శరత్ నర్వాడే మంచి కసరత్తు చేసిన ఫీలింగ్ ట్రైలర్లో కలిగింది.
ఇక సినిమా విషయానికి వస్తే.. శుభలేఖలు అనే పదం వినగానే పెళ్లి తంతు గుర్తుకొస్తుంది. వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి జరిపించాలని పెద్దలు అంటారు. పెళ్లికి చెప్పే అబద్ధం తప్పు కాదని, రెండు మనసులను కలపడానికి చేసే మంచి ప్రయత్నమని వారి భావన. కానీ నేటి ట్రెండ్లో పెళ్లి అంటే సత్యం అనే ధోరణి మొదలైంది. ఇప్పుడు పెళ్లి కోసం ఆడే అబద్ధాలను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి విషయాలను డిస్కస్ చేస్తూ చాలా ఇన్నొవేటివ్ కథాంశంతో శుభలేఖ+లు చిత్రం రూపొందుతోంది.
శరత్ నర్వాడే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి.విద్యాసాగర్, ఆర్.ఆర్.జనార్దన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లు. ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రధారులు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అప్పాజీ ,డా . ఇర్ఫాన్ , తిరువీర్,సింధు తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ - మాటలు: జనార్దన్ -విస్సు, సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: మధు, ఆర్ట్: బ్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శరత్ నర్వాడే.