twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోసం: టాలీవుడ్ మొహం చూడనంటున్న శ్వేతా బసు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నటి శ్వేతా బసు ప్రసాద్....తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా అదృష్టం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే ఆమె సెక్స్ స్కాండల్‌లో పట్టుబడటం అందరినీ షాక్ గురి చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొంతకాలం రెస్క్యూ హోంలో గడిపి ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఆమె ముంబైకి మకాం మార్చింది.

    ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయిన పాంటమ్ ప్రొడక్షన్స్‌లో స్క్రిప్టు కన్సల్టెంటుగా చేరింది. ఇకపై తెలుగు సినిమాల్లో నటించనని శ్వేతా బసు నిర్ణయించుకుందట. తనను మోసం చేసి ఇలాంటి స్థితికి తెచ్చిన వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెబుతోంది శ్వేతా బసు.

    Shweta Basu maintain distance to Tollywood

    కాగా...ఇటీవల శ్వేతా బసుకు హన్సల్ మెహతా డాక్యుమెంటరీలో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు వచ్చిన సంగగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను శ్వేతా బసు ఖండించింది. నేను హన్సల్ మెహతాను కలిసిన మాట వాస్తవమే. కానీ హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ పై తీస్తున్న డాక్యుమెంటరీలోనేను నటించం లేదు' అని తెలిపారు. వాస్తవానికి ఈ డ్యాక్యుమెంటరీలో శ్వేతా బసు చేయాల్సిన పాత్ర ఏమీ లేదట. త్వరలోనే ఆమెకు అవకాశం ఇస్తానని హన్సల్ మెహతా మాట ఇచ్చారు. ఆ అవకాశం కోసం శ్వేతా బసు ఎదురు చూస్తోంది.

    ఓ రేంజిలో అందాలను ఎక్స్ పోజ్ చేసిన శ్వేతబసు:క్లిక్ చేయండి

    మరికొందరు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆమెకు చాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఇక ముంబైలోనే ఉండి మళ్లీ తన కెరీర్ చక్కదిద్దుకోవాలనే ప్లాన్లో ఉంది శ్వేతా బసు.

    English summary
    TollShweta Basu maintain distance to Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X