twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    15 రూ లకే 'అరుంధతి'

    By Staff
    |

    Shyam Prasad Reddy
    "మస్కా", "కింగ్", "అరుంధతి" చిత్రాలు కలిపి 15 రూపాయలకే పైరసీ డీవీడీలు వస్తున్నాయని అంటూ..వాటిలో కొన్నింటిని అరుంధతి నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి విలేకరులకు చూపించారు. శుక్రవారం (13వ తేదీ) రాత్రి అందిన సమాచారం ప్రకారం యాంటీ వీడియో పైరసీ సెల్‌, పోలీసుల సహకారంతో హైదరాబాద్‌ శివార్లలోని దిల్‌సుఖ్‌నగర్‌లో కారులో ఉండి మస్కా, కింగ్‌, అరుంధతి సినిమాల కాంబినేషన్‌ పైరసీ డీవీడీలను అమ్ముతున్న పండుగ శోభన్‌ అనే వ్యక్తిని పట్టుకున్నాం.

    రూ.50 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ మూడు సినిమాల డీవీడీలను అతను కేవలం రూ. 15కే అమ్ముతున్నాడు. పోలీసుల ఇంటరాగేషన్‌లో అతను ఈ పైరసీ రాకెట్‌లో పాల్గొంటున్న 62 డీలర్ల గురించిన సమాచారం అందించాడు. రెండు మూడేళ్ల కష్టంతో మేం తీస్తున్న సినిమాలను ఇలా చౌకగా పైరసీ డీవీడీల రూపంలో తీసుకువచ్చే పరిస్థితుల్లో మంచి సినిమాలనేవి రావు. నిర్మాతలంతా ఏకమై దీనిపై కలిసి కట్టుగా పోరాడాలి. ప్రజలు కూడా పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమాలు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా'' అని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X